పన్నూరు శ్రీపతి

పన్నూరు శ్రీపతి : చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యాయునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం ఇతని ప్రత్యేకత, శిల్పకళాకారునిగా మంచిపేరు గలదు. పలుభాషలలో వ్రాయగల దిట్ట. హైదరాబాదు లోని తెలుగు లలిత కళాతోరణంలో సభ్యుడు కూడానూ.

పన్నూరు శ్రీపతి
పన్నూరు శ్రీపతి, చిత్రకారుడు
జననం1943
మదనపల్లి
మరణం2010
హైదరాబాద్
ఇతర పేర్లుశ్రీపతి
వృత్తిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో ఆర్ట్ టీచర్
ప్రసిద్ధిచిత్రకారుడు

సత్కారాలు మార్చు

  • పద్మశ్రీ : ఇతని కళా తపస్సును గుర్తించి భారత ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.
  • శిల్పగురు : భారత ప్రభుత్వం ఇతనికి 2008 శిల్పగురు అవార్డు ప్రదానం చేసింది.[1]

ఇతని శిష్యగణం కూడా కళారంగంలో రాణిస్తోంది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-16. Retrieved 2008-12-15.