పరమానందయ్య శిష్యులు
'పరమానందయ్య శిష్యులు' తెలుగు చలన చిత్రం,1950 అక్టోబర్ 6 న విడుదల. నటుడు, నిర్మాత, దర్శకుడు,గా కస్తూరి శివరావు తెరకెక్కించిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యo , చిలకలపూడి సీతారామాంజనేయులు, గిరిజ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఒగిరాల రామచంద్రరావు, సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచారు.
పరమానందయ్య శిష్యులు (1950 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కస్తూరి శివరావు |
---|---|
నిర్మాణం | కస్తూరి శివరావు |
చిత్రానువాదం | తాపీ ధర్మారావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (చంద్రసేనుడు), లక్ష్మీరాజ్యం (లీలావతి), గిరిజ (హేమ), చిలకలపూడి సీతారామాంజనేయులు (పరమానందయ్య), రేలంగి వెంకటరామయ్య, కస్తూరి శివరావు, సీత, గడ్డేపల్లి రామయ్య, ఎన్.బాలసరస్వతి |
సంగీతం | ఓగిరాల రామచంద్రరావు |
నేపథ్య గానం | సుసర్ల దక్షిణామూర్తి, కె.రాణి |
సంభాషణలు | తాపీ ధర్మారావు |
నిర్మాణ సంస్థ | ఎలైడ్ ప్రొడక్షన్స్ |
నిడివి | 200 నిముషాలు |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చునిర్మాత , దర్శకుడు: కస్తూరి శివరావు
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు_సుసర్ల దక్షిణామూర్తి
గీత రచయిత : తాపీ ధర్మారావు నాయుడు
నేపథ్య గానం: చిలకలపూడి సీతారామాంజనేయులు, సుసర్ల దక్షిణామూర్తి, కస్తూరి శివరావు, పి.లీల
నిర్మాణ సంస్థ: ఎలైడ్ ప్రొడక్షన్స్
విడుదల:06:10:1950.
పాటలు
మార్చు- అహా సంతర్పణమే సతతము కలిగిన - బృందగీతం
- చూచితివా జనకా తండ్రిలేని - ?
- ఈలీల చెలియను ఎడబాసి నే ఏ రీతి - సుసర్ల దక్షిణామూర్తి
- ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాల లేదు - కస్తూరి శివరావు బృందం
- ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయి - సుసర్ల దక్షిణామూర్తి
- ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయి -సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
- పరమానందయ గురువర్య - ?
- పోలిక రాదా గురుతే లేదా ఎటులో గదా - కె. రాణి, సుసర్ల దక్షిణామూర్తి
- రంగారంగేళి లోకం మతలబు - కస్తూరి శివరావు
- ఇదిగో ఇదిగో ఇదిగో సైయమ్మ నన్నే దొంగను చేయామ్మా,
- కలవు భుజింపగా పలురకమ్ముల కొమ్ము ఫలమ్ము(పద్యం)- సి.ఎస్.ఆర్ ఆంజనేయులు
- కాలమహిమను నేను గణుతించేదను వినుము,
- చిల్లర రాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడేనురా ఒరే ఒరే_బృంద గీతం.