పలుగుంటిపల్లి
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
పలుగుంటిపల్లి, ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | రాచర్ల మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( 08405 ![]() |
పిన్కోడ్ | 523368 ![]() |
గ్రామ చరిత్ర మార్చు
పూర్వ కాలంలో భగవంతుడు అయిన ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గాన ఈ గ్రామం పై నుంచి ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఆయన చేతి లోని పాల కుండ పొరపాటున క్రింద పడి పగిలి పోయి దానిలో ఉన్న పాలు ఒక పెద్ద తెల్లని రాయిగా మారాయి . ఆ తెల్లని రాయి నే పలుగు గుండు అని పిలిచారు అప్పటి నుండి ఈ ఊరు పేరు పలుగుంటి పల్లి అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇది ఊరికి ఉత్తరం దిశలో ఉంది
విద్యా సౌకర్యాలు మార్చు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు, ఈ పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించడంతో, ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుచుచున్నది. విద్యార్థుల యొక్క క్రీడా స్ఫూర్తి అభినందించ తగినది
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు
- శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభించెదరు. మరుసటి రోజు ఉదయం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించెదరు. అనంతరం శాంతిహోమం నిర్వహించెదరు. సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు.[1]
- శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం.
- ఈ గ్రామంలో 27 అడుగుల హనుమన్ విగ్రహం వద్ద ప్రతిష్ఠించు విగ్రహాలకు, 2015, నవంబరు-24వ తేదీనాడు గ్రామోత్సవం నిర్వహించారు.[2]
- ఈ గ్రామంలో సుమారు 20 లక్షల ఖర్చు చేసి ప్రతిష్ఠాత్మకంగా పీర్ల చావిడి నిర్మించారు
- ఈ గ్రామంలో ముుఖ్యమైన పండుగ మొహరం (పీర్ల పండుగ)
- గ్రామంలో ఉత్తరం వైపు చారిత్రక ఆధారం అయిన తెల్లని పలుగు రాయి ఉన్నది దీని ఎత్తు సుమారు 20 అడుగులు
- ఈ గ్రామంలో రాబోవు 2 సంవత్సరాలలో శివుని గుడి నిర్మించ తలపెట్టారు
ప్రధాన పంటలు మార్చు
వరి, మిరప, పత్తి, మల్బరీ సాగు, కూరగాయలు
ప్రధాన వృత్తులు మార్చు
వ్యవసాయం. ఆర్మీ, పారా మిలటరీ, సాఫ్టువేర్