పాలకొండ రెవెన్యూ డివిజను

పాలకొండ రెవెన్యూ డివిజను, శ్రీకాకుళంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 13 మండలాలు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 635 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

పాలకొండ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
ప్రధాన కార్యాలయంశ్రీకాకుళం
మండలాల సంఖ్య13

పరిపాలన మార్చు

శ్రీకాకుళం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలన పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్ణణం డివిజను కేంద్రంగా ఉంది.రెవెన్యూ విభాగానికి రెవెన్యూ డివిజినల్ అధికారి అధిపతిగా వ్యవహరిస్తాడు.ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉంటాడు.ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరిస్తాడు.

రెవెన్యూ డివిజను లోని మండలాలు మార్చు

  1. పాలకొండ మండలం -45
  2. వీరఘట్టం మండలం - 41
  3. సీతంపేట మండలం - 118
  4. సారవకోట మండలం - 43
  5. సంతకవిటి మండలం - 52
  6. పాతపట్నం మండలం -49
  7. మెళియాపుట్టి మండలం - 70
  8. హీరమండలం మండలం - 40
  9. కొత్తూరు మండలం - 36
  10. భామిని మండలం - 22
  11. రేగిడి ఆమదాలవలస మండలం - 51
  12. వంగర మండలం -37
  13. రాజాం మండలం - 31[2]

జనాభా గణాంకాలు మార్చు

డివిజన్‌లో 7,98,407 మంది జనాభా ఉన్నారు. 7,28,847 గ్రామీణ ప్రాంతంలోను 69,560 పట్టణ ప్రాంతంలోను ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు వరుసగా 13.21%, 14.66% ఉన్నారు.జనాభాలో 98.31% హిందువులు ఉన్నారు.[3][4]

మూలాలు మార్చు

  1. "మండలాలు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2022-01-12.
  2. https://srikakulam.ap.gov.in/revenue-villages/
  3. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  4. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు మార్చు