పులివెందుల
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం.[1]
పులివెందుల | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | పులివెందల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516390 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్రసవరించు
పూర్వం ఇక్కడ వారు ఆరు మాసాల పాటు తపమాచరించారని, ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. ఇక్కడ రాజ రెడ్డి కళాశాల స్థాపించబడిఉన్న కొండ పై ఒకప్పుడు కోట ఉండేది, కళాశాల భవనం కోసం తవ్వకాలు జరిపినప్పుడు రుద్రమదేవి విగ్రహం ఒకటి బయట పడింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తొలి శాసనం (1509) పులివెందుల పట్టణానికి సమీపంలోని శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో ఉంది. రాజకీయంగా ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది.
గ్రామ నామ చరిత్రసవరించు
పులివెందుల పేరు "పులి మందల" అన్న పదం నుంచి వచ్చిందని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో పులుల మందలు ఎక్కువగా ఉండేవనీ, కాబట్టి పులిమందల అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్పే వ్యుత్పత్తి. అదే కాలక్రమేణా పులివెందుల అయిందంటారు.[2]
భౌగోళికాంశాలుసవరించు
పులివెందుల 14°25′00″N 78°14′00″E / 14.4167°N 78.2333°E వద్ద ఉంది.[3] సముద్ర మట్టానికి 272 మీటర్ల ఎత్తులో గలదు (895 అడుగులు).
సమీప గ్రామాలుసవరించు
సమీప మండలాలుసవరించు
పట్టణ పరిపాలనసవరించు
గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు
చుట్టు పక్కల గ్రామాలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇది ఒక విద్యా కేంద్రంగా వ్యవహరిస్తుంది. ప్రఖ్యాత జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, 2006లో, Dr.వై.ఎస్.రాజశఖరరెడ్డి గారిచే ఇక్కడ స్థాపించబడింది.
- AP IIIT R.K. VALLEY (RGUKT) (IDUPULAPAYA)*
ఆహార విజ్ఞానశాస్త్ర, సాంకేతిక కళాశాలసవరించు
ఈ కళాశాలలోని బి.టెక్.ఫుడ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందడానికి, విద్యార్ధులు, ఎం.సెట్.లో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు ఉపాధి సౌకర్యాలు మెండుగా ఉంటవి. విద్యార్ధులకు, స్వతహాగా పరిశ్రమలు స్థాపించేటందుకు బ్యాంకులు ఋణసదుపాయం కల్పించగలవు. [1]
వైద్య సౌకర్యాలుసవరించు
ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు
ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు
ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయంసవరించు
ఇక్కడ ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, బత్తాయి, అరటి, వేరు శెనగ సాగు చేస్తారు. చిత్రావతి నది పై పార్నపల్లె వద్ద గల ఆనకట్ట ద్వారా తాగు నీరు ఇంకా సాగు నీరు అందుతాయి.
ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రంసవరించు
ఈ కేంద్రం పులివెందల పట్టణ శివారులో ఉన్నది.
పట్టణ ప్రముఖులుసవరించు
- పులివెందుల నబీసాయిబు, వర సిద్ధి వినాయక చెక్క భజన సంఘం స్థాపకుడు
- వై.యస్. రాజశేఖరరెడ్డి
పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంసవరించు
శ్రీ మిట్టమల్లేశేశ్వర స్వామివారి ఆలయంసవరించు
ఈ ఆలయం పులివెందల పట్టణంలోని గుంత బజారు వీధిలో, ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్నది.
ఈ ఆలయంలో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రవేశ ద్వార నిర్మాణానికి 2020,నవంబరు-16వతేదీ సోమవారం నాడు, భూమిపూజ నిర్వహించినారు. [1]
పట్టణ విశేషాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.
- ↑ జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. pp. 62, 63. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2016. Retrieved 2 July 2018. Check date values in:
|archive-date=
(help) - ↑ Falling Rain Genomics.Pulivendla
వెలుపలి లింకులుసవరించు
[1].ఈనాడు కడప;2020,సెప్టెంబరు-30;2వపేజీ.