పులివెందుల

ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల మండల పట్టణం

పులివెందుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం.

పట్టణం
పటం
Coordinates: 14°25′N 78°14′E / 14.42°N 78.23°E / 14.42; 78.23
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంపులివెందుల మండలం
Area
 • మొత్తం87.17 km2 (33.66 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం65,706
 • Density750/km2 (2,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006
Area code+91 ( 08568 Edit this on Wikidata )
పిన్(PIN)516390 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

గ్రామ చరిత్ర సవరించు

పూర్వం ఇక్కడ వారు ఆరు మాసాల పాటు తపమాచరించారని, ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. ఇక్కడ రాజ రెడ్డి కళాశాల స్థాపించబడిఉన్న కొండ పై ఒకప్పుడు కోట ఉండేది, కళాశాల భవనం కోసం తవ్వకాలు జరిపినప్పుడు రుద్రమదేవి విగ్రహం ఒకటి బయట పడింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తొలి శాసనం (1509) పులివెందుల పట్టణానికి సమీపంలోని శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో ఉంది. రాజకీయంగా ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది.

గ్రామ నామ చరిత్ర సవరించు

పులివెందుల పేరు "పులి మందల" అన్న పదం నుంచి వచ్చిందని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో పులుల మందలు ఎక్కువగా ఉండేవనీ, కాబట్టి పులిమందల అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్పే వ్యుత్పత్తి. అదే కాలక్రమేణా పులివెందుల అయిందంటారు.[2]

భౌగోళికాంశాలు సవరించు

పులివెందుల 14°25′00″N 78°14′00″E / 14.4167°N 78.2333°E / 14.4167; 78.2333 వద్ద ఉంది.[3] సముద్ర మట్టానికి 272 మీటర్ల ఎత్తులో గలదు (895 అడుగులు).

జనగణన వివరాలు సవరించు

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 65,706.

పరిపాలన సవరించు

పులివెందుల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు సవరించు

చుట్టు పక్కల గ్రామాలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇది ఒక విద్యా కేంద్రంగా వ్యవహరిస్తుంది.

  • జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, 2006లో, వై.ఎస్.రాజశేఖరరెడ్డి చే ఇక్కడ స్థాపించబడింది.
  • AP IIIT R.K. VALLEY (RGUKT),ఇడుపులపాయ
  • ఆహార విజ్ఞానశాస్త్ర, సాంకేతిక కళాశాల
  • ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం
  • Loyola (YSRR) Degree & PG College
  • Loyola Polytechnic College

ప్రముఖులు సవరించు

 
వై.యస్. రాజశేఖరరెడ్డి: ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి,

వ్యవసాయం సవరించు

ఇక్కడ ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, బత్తాయి, అరటి, వేరు శెనగ సాగు చేస్తారు. చిత్రావతి నది పై పార్నపల్లె వద్ద గల ఆనకట్ట ద్వారా తాగు నీరు ఇంకా సాగు నీరు అందుతాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు సవరించు

  • శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం
  • శ్రీ మిట్టమల్లేశేశ్వర స్వామివారి ఆలయం

శ్రీ రంగనాథ స్వామి దేవాలయం , అత్యంత ప్రాచీనమైనది.

మూలాలు సవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. pp. 62, 63. Archived from the original (PDF) on 2016-04-05. Retrieved 2 July 2018.
  3. Falling Rain Genomics.Pulivendla

వెలుపలి లింకులు సవరించు