పూల రంగడు (1989 సినిమా)

పూల రంగడు 1989 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం, శుభోదయ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వై.సత్యనారాయణ నిర్మించగా, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, అశ్విని, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[1] ఈ చిత్రం పాత తెలుగు చిత్రం విచిత్ర కుటుంబం కథను పోలి ఉంటుంది. అందులో ఎన్ టి రామారావు, సావిత్రి, కృష్ణ కీలక పాత్రల్లో నటించారు.[2]

పూల రంగడు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం వై. సత్యనారాయణ
కథ రేలంగి నరసింహారావు
కొంపెల్ల విశ్వం
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
తారాగణం నూతన్ ప్రసాద్,
బ్రహ్మానందం
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం బి. కోటేశ్వరరావు
కూర్పు డి. రాజగోపాల్
నిర్మాణ సంస్థ శుభోదయా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ సవరించు

ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది, దాని ప్రెసిడెంటు హరిశ్చంద్ర ప్రసాద్ (శరత్ బాబు) పేరున్న వ్యక్తి. తన అమాయక భార్య పార్వతి (వాణిశ్రీ), కోపిష్టి తమ్ముడు రంగా (రాజేంద్ర ప్రసాద్) తో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. పనికిరాని గొడవల్లో ఎప్పుడూ తలదూర్చే రంగాను పార్వతి సొంత కొడుకుగా చూసుకుంటుంది. గ్రామంపై పట్టు ఉండలని కోరుకునే దుష్ట వ్యక్తి నాగభూషణం (నూటన్ ప్రసాద్) కు రంగా కంటగింపు అవుతాడు. ఇంతలో, రంగా అందమైన గౌరి (అశ్విని) ను ప్రేమిస్తాడు. ఆమె అక్క లక్ష్మి (శ్రీలక్ష్మి) మానసిక వికలాంగురాలు. ఒకసారి, నాగభూషణం ఆమెను మానభంగం చేస్తాడు. రంగా తెలివిగా వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తాడు. దీన్ని,అనసులో పెట్టుకుని నాగభూషణం, రంగా హరిచంద్ర ప్రసాద్ల‌ను చంపడానికి కుట్రలు చేసినా వారు తప్పించుకుంటారు. చివరికి, మళ్ళీ గ్రామంలో ఎన్నికలు ప్రకటించినపుడు, నాగభూషణం పార్వతిని బెదిరించి, హరిశ్చంద్ర ప్రసాద్ నిలబడకుండా చేస్తాడు. కాబట్టి, గ్రామాన్ని రక్షించడానికి, రంగా పోటీ చేస్తాడు.

ప్రచార సమయంలో జరిగిన గొడవలో రంగా నాగభూషణాన్ని కొట్టబోతూండగా పార్వతి అతన్ని ఆపి తీసుకెళ్తుంది. అయితే నాగభూషణం రంగాపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తాడు. కోర్టులో పార్వతి రంగాను దోషి అని ధ్రువీకరిస్తుంది, అతనికి శిక్ష పడుతుంది. హరిచంద్ర ప్రసాద్‌తో సహా అందరూ పార్వతిని నిందిస్తారు, అప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు రంగాను కాపాడటమే దాని వెనుక గల కారణమని ఆమె వెల్లడిస్తుంది. సమయం గడిచిపోతుంది, రంగా భారీ మెజారిటీతో గెలుస్తాడు. అతణ్ణి జైలు నుండి విడుదల చేస్తారు. ఇక్కడ అతను తన లక్ష్యాన్ని సాధించే వరకు అన్నా వదినలను దూరంగా ఉంచడానికి వారి పట్ల ద్వేషాన్ని చూపిస్తాడు. ప్రస్తుతం, రంగా నాగభూషణాన్ని ఆటపట్టించడం ప్రారంభించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. అదే సమయంలో, ప్రభుత్వం వారి గ్రామ పంచాయతీకి రూ .1 కోటి మంజూరు చేస్తుంది. దీని కోసం నాగభూషణం హరిశ్చంద్ర ప్రసాద్, పార్వతి లను కిడ్నాప్ చేస్తాడు. చివరికి రంగా వారిని రక్షించి నాగభూషణం ముగింపు చూస్తాడు. రంగా. గౌరీల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

తారాగణం సవరించు

పాటలు సవరించు

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "యెడెకోక్కటే" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి, మనో 3:05
2 "రావే రంగమ్మో" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:45
3 "చీరపెట్టు పూలుపెట్టు" ముళ్ళపూడి శాస్త్రి మనో, ఎస్.జానకి 4:16
4 "ఓటరులారా ఓటరులారా" ముళ్ళపూడి శాస్త్రి మనో, మాధపెద్ది రమేష్, రమణి 4:07

మూలాలు సవరించు

  1. "Poola Rangadu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-02-21. Retrieved 2020-08-25.
  2. "Poola Rangadu (Review)". The Cine Bay.