పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)

డ్పెళ్ళిచేసి చూడు 1988 లో విడుదలైన తెలుగు సినిమా. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి. కౌసల్య నిర్మించింది[1] రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, అశ్విని నటించారు. హంసలేఖ సంగీతం సమకూర్చాడు.[3] ఇది కన్నడ చిత్రం అవలే నన్నా హెండ్తి (1988) యొక్క రీమేక్. తరువాత దీనిని హిందీలోకి జవానీ జిందాబాద్ (1990) గా రీమేక్ చేశారు.[4] ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు హంసలేఖకు తొలి చిత్రం. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[5]

పెళ్ళి చేసి చూడు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం బి. కౌసల్య
కథ ప్రభాకర్
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
అశ్వని ,
అన్నపూర్ణ
సంగీతం హంసలేఖ
సంభాషణలు దివాకర్ బాబు
ఛాయాగ్రహణం బి. కోటేశ్వరరావు
కూర్పు మురళి రామయ్య
నిర్మాణ సంస్థ కౌసల్య పిక్చర్స్
భాష తెలుగు

కథ మార్చు

మోహన్ (రాజేంద్ర ప్రసాద్), వరకట్న వ్యవస్థను నిరసిస్తూ ఎప్పుడూ కట్నం ఇవ్వను తీసుకోను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అతను తన తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా కట్నం అడగకుండానే ఉమను (అశ్విని) పెళ్ళి చేసుకుంటాడు. పరమేశ్వరరావు (గొల్లపూడి మారుతీరావు), సావిత్రి (పిఆర్ వరలక్ష్మి) కుమారుడు రవి (రాజా) తో తన సోదరి సీత (తార) కుదురుస్తాడు. పరమేశ్వరరావు మునిసిపల్ కమిషనర్. చాలా అత్యాశగల వ్యక్తి. కట్నం రాకపోవడంతో, అతను అతని భార్య చాలా కలత చెందుతారు. రవి మాత్రం సంతోషంగా ఉంటాడు. రవి కట్నం పొందే విధంగా తిరిగి వివాహం చేయ్యాలని తల్లిదండ్రులిద్దరూ కోరుకుంటారు.

ఇంతలో, సీత గర్భవతి అవుతుంది. అత్తమామలు ఆమెను తొందరగా అడ్డు తొలగించడానికి ప్రయత్నిస్తారు. పరమేశ్వరరావు రవిని వేరే నగరానికి బదిలీ చేయిస్తాడు. అతన్ని పంపిన తరువాత, పరమేశ్వరరావు సీతను ప్రమాదానికి గురైనట్లుగా చిత్రించి చంపాలని యోచిస్తాడు. అతను ఊహించినట్లుగా ఘటనలు జరగవు. అతడు కల్పించిన ప్రమాదంలో భార్య తీవ్రంగా కాలిపోతుంది. ఆమెను ఆసుపత్రిలో చేరుస్తాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పరమేశ్వరరావు సావిత్రిని చంపడానికి సీతే ప్రయత్నించిందని నిందిస్తాడు. ఆమెను అరెస్టు చేయిస్తాడు. చివరగా, పరమేశ్వరరావుకు అప్పు చేసి కట్నం డబ్బు ముట్టజెప్పి, అతణ్ణి చిత క్కొడతాడు. రవి తన తండ్రితో సంబంధం తెంచుకుని ఇంటిని విడిచిపెట్టినప్పుడు, అతడు పశ్చాత్తాపం చెందుతాడు. సీతను క్షమించమని అడుగుతాడు. ఇప్పుడే పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన సీత అతన్ని క్షమిస్తుంది. పరమేశ్వరరావు తిరిగి మోహన్కు కట్నం డబ్బ్బు వెనక్కి ఇచ్చేస్తాడు. అతను కూడా ఇకపై తన కుటుంబంలో ఎవరూ కట్నం తీసుకోరు లేదా స్వీకరించరు అని ప్రతిజ్ఞ చేస్తాడు.

తారాగణం మార్చు

పాటలు మార్చు

సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలకు హంసలేఖ సంగీతం సమకూర్చాడు.[6]

ఎస్. లేదు పాట పేరు సింగర్స్ పొడవు
1 "మీసమున్న మగాడిదే" ఎస్పీ బాలు 4:06
2 "అంతా దూరానా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:21
3 "ఓ పిల్లా పిచ్చి" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:21
4 "మనసొక గువ్వలగూడు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:36
5 "సాగరాలను" ఎస్.జానకి, పి.సుశీల 2:36

మూలాలు మార్చు

  1. "Pelli Chesi Choodu (Banner)". Spicy Onion.
  2. "Pelli Chesi Choodu (Direction)". Know Your Films.
  3. "Pelli Chesi Choodu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2017-09-20. Retrieved 2020-08-05.
  4. "Pelli Chesi Choodu (1988)". telugucineblitz.blogspot.in.
  5. "Pelli Chesi Choodu (Review)". The Cine Bay. Archived from the original on 2018-08-03. Retrieved 2020-08-05.
  6. "Pelli Chesi Choodu (Songs)". Cineradham. Archived from the original on 2017-08-19. Retrieved 2020-08-05.