పేరాయపాలెం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, అద్దంకి మండలంలోని గ్రామం

పేరాయపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 16°36′04″N 80°27′47″E / 16.601°N 80.463°E / 16.601; 80.463
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంఅద్దంకి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పటం

గ్రామ పంచాయితీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీ యానం రామాంజనేయులు, సర్పంచిగా ఎన్నికైనారు. ( ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-10; 2వపేజీ.)

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

ఈ గ్రామంలో 2008లో రు. 1.3 కోట్ల నాబార్డ్ నిధులతో శ్రీ లక్ష్మీనరసింహ ఎత్తిపోతల పథకం ఏర్పాటయినది. పేరాయపాలెం గ్రామానికి ఆనుకొని, నిత్యం నిండుకుండలా ప్రవహించే దోర్నపు వాగుపై ఈ పథకాన్ని ఏర్పాటు చేసారు. దీని ద్వారా 500 ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యం. ఈ పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే, పేరాయపాలెంతో పాటు ధేనువకొండ గ్రామాల భూములు గూడా సస్యశ్యామలం అవుతాయి. దోర్నపు వాగు అంచున, పంపు హౌస్ నిర్మించి 70 హెచ్.పి. సామర్ధ్యంగల 3 విద్యుత్తు పంపు సెట్లను అమర్చారు. ఈ పథకం నుండి ఒక కిలోమీటరు దూరం పొడవున ప్రధాన కాలువ నిర్మించారు. దీనికి అనుసంధానంగా, వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరా చేసెటందుకు అవసరమైన చిన్నకాలువలు ఏర్పాటు చేసారు. ఇది రెండేళ్ళపాటు రైతులకు అడపాదడపా ఉపయోగపడింది. తరువాత ఈ పథకం మూలన పడినది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం మార్చు

పేరాయపాలెం గ్రామంలో కొండపై వేంచేసియున్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [2]

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు