మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
వికీకరణ |
||
పంక్తి 1:
'''మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి''' గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖులు, ఇటీవలివారు. వీరి నివాసం [[రాజమండ్రి]]. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగానూ వీరికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ▼
[[దస్త్రం:Madhunapantula satyanarayana sastry.JPG|right|250px|thumb|మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]]
▲'''మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి'''
ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్ర్తీగారు ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి ఒంగళి-కాటూరి కవుల ‘‘సౌందరనందము’’ దుర్భాక రాజశేఖర శతావధానిగారి ‘‘రాణా ప్రతాప సింహచరిత్ర’’, శతావధాని గడియారం వేంకట శేషశాస్ర్తీ గారి ‘‘శ్రీ శివభారతము’’, తుమ్మల సీతారామమూర్తి గారి ‘‘బాపూజీ ఆత్మకథ’’ అనేవి. శాస్ర్తీగారు రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైన సాహిత్య సౌరభంతో గుబాళించే రసవత్తర కావ్యం.▼
▲ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి.
‘‘ఆంధ్ర రచయితలు’’ శాస్ర్తీగారి ప్రసిద్ధ రచనలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్ర్తీగారి కుమారులు ‘‘మధునామూర్తి’’ గారు సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశారు.▼
▲
శాస్ర్తీగారు రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్ర్తీ పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణగారు పీఠిక వ్రాస్తూ శాస్ర్తీగారు మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదాహరించారు.▼
▲
<poem>
తే॥ నొడువ జాలని యిడుమల గుడిచి బడలి
Line 16 ⟶ 14:
గాజు కన్నైన నొక యశ్రుకణము రాల్చు’’
</poem>
==
* [http://www.andhrabhoomi.net/content/sub-feature-9 ఆంధ్ర భూమి లో వ్యాసం]
[[వర్గం:తెలుగు కవులు]]
|