టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 7:
==ముఖ్యమంత్రిగా==
1982లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రేసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో [[ఇందిరా గాంధీ]] మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా ''జంబో మంత్రివర్గమని'' పిలిచేవారు<ref name=anj1>Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41</ref>. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడితేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు<ref name=anj2>Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41</ref>. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయి ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.
 
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.<ref>The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542[http://books.google.com/books?id=xg4tAAAAIAAJ&q=t.+anjaiah&dq=t.+anjaiah&pgis=1]</ref>
 
1984 పార్లమెంటు ఎన్నికలలో [[సికింద్రాబాదు]] నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రేసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా [[రాజీవ్ గాంధీ]] మంత్రివర్గములో పనిచేశాడు.ఈయన తర్వాత ఈయన సతీమణి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు