పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
'''పుట్టపర్తి నారాయణాచార్యులు''' తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే [[శివతాండవ కావ్యం]] యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు '''పుట్టపర్తి నారాయణాచార్యులు'''. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.
== జీవిత విశేషాలు ==
'''పుట్టపర్తి నారాయణాచార్యులు''' [[1914]], [[మార్చి 28]], న [[అనంతపురం]] జిల్లా అనంతపురం మండలంలోని [[చియ్యేడు]] గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి(ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. [[శ్రీకృష్ణదేవరాయలరాజగురువు)శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
 
నారాయణాచార్యులు చిన్న వయసులోనే [[భారతం]], [[భాగవతం]], పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన [[తిరుపతి]] సంస్కృత కళాశాలలో [[సంస్కృతం]] నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద [[వ్యాకరణం]], [[ఛందస్సు]], తదితరాలు నేర్చుకున్నారు. [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]]లో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర [[భరత నాట్యం]] నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]]లో [[పిట్ దొరసానమ్మ]] వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు<ref name="శశిశ్రీ మోనోగ్రాఫ్">{{cite book|last1=శశిశ్రీ|title=పుట్టపర్తి నారాయణాచార్య (మోనోగ్రాఫ్)|date=2012|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-4106-4|page=12|edition=1}}</ref>.
 
[[ప్రొద్దుటూరు]] వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, [[మహాత్మా గాంధీ|గాంధీ]] వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు [[ఢిల్లీ]] లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు [[కడప]]లో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.