మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 1:
 
{{దేశ సమాచారపెట్టె1
|native_name = మలేషియా
Line 67 ⟶ 66:
}}
 
[['''మలేషియా]]''' ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియా లో 13 రాష్ట్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం(పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్‌లాండ్, ఇండోనేషియా, మరియు బ్రునై దేశాలు, మరియు సముద్ర సరిహద్దులు సింగపూర్, వియత్నాం, మరియు ఫిలిప్పీన్స్ దేశాలు. రాజధాని నగరం కౌలాలంపూరు మరియు పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, బోర్నియో లో 28,33 మిలియన్లు.
ప్రస్థుత మలేషియా కు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 31 ఆగష్టు 1957 న స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, మరియు సింగపూరు ప్రాంతాలను మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియా గా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూరు ను సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దాని సహజ వనరులపై ఆధారపడి ఉంది కాని వైజ్ఞానిక, పర్యటక, వాణిజ్య మరియు వైద్య పర్యటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.
 
Line 79 ⟶ 78:
== చరిత్ర ==
మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్ధం నుండి ఇక్కడకు భారతదేశం మరియు చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. వారు ఇక్కడ 2-3 శతాబధాలలో వాణిజ్య రేవులు మరియు తీరప్రాంత నగరాలు నిర్మించారు.
వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి , సంప్రదాయాలు ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ మరియు బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్ధంలో లాంగ్‌కసుకా సాంరాజ్యం స్థాపించబడి 15వ శతాబ్ధం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సాంరాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సాంరాజ్యం పతనం తరువాత మలేషియా ద్వీపకల్పం మరియు మలేషియా ఆర్చిపెలెగోల మీద మజపాహిట్ సాంరాజ్య ఆధిక్యం కొనసాగింది. 14వ శతాబ్ధం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్ధంలో శ్రీవిజయ సాంరాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సాంరాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. ఈ సమయంలో మలక్క ముఖ్యమైన వ్యాపారకూడలిగా ఉంటూ పరిసర భూభాగాన్ని వ్యాపారపరంగా ఆకర్షిస్తూ వచ్చింది. పరమేశ్వరా ముస్లిం మతం స్వీకరించి ముస్లిం మతాం వేగంగా విస్తరింపజేసాడు.
 
1511 లో పోర్చుగీస్ మలక్కా సాంరాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. 1786లో మలేషియాలోకి బ్రిటిష్ సాంరాజ్యం ప్రవేశించింది. తరువాత ఈస్టిండియా కంపెనీ సుల్తాన్ కెదాహ్ నుండి పెనాంగును లీజుకు తీసుకుంది. 1819 లో సింగపూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సాంరాజ్యం 1824 నాటికి మలయా మీద ఆధిపత్యం సాధించింది.
నేరుగా ఒప్పందం ద్వారా సింగపూర్ మరియు లబుయన్ ద్వీపంలో కాలనీని స్థాపించారు. 20వ శతాబ్ధం నాటికి పహాంగ్, సెలాంగర్, పెరక్ మరియు నెగెరి సెంబిలన్ రాష్ట్రాలు ఫెడరేటెడ్ మలాయ్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. మలాయ్ పాలకులతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మలాయ్ పాలకులకు బ్రిటిష్ పౌరులు సలహాదారుగా నియమించబడ్డారు. మిగిలిన 5 రాష్ట్రాలు ఫెడరేటెడ్ కాని రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. 20 శతాబ్ధానికి ఈ రాష్ట్రాలు బ్రిటిష్ ఆధీనంలో లేనప్పటికీ ఇక్కడ కూడా బ్రిటిష్ సలహాదారులు అనుమతించబడ్డారు. 19వ శతాబ్ధంలో ద్వీపకల్పంలో మరియు బొర్నియో లలో అభివృద్ధి సధారణంగా ప్రత్యేకత కలిగి ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశం మరియు చైనా దేశాల నుండి ఇక్కడకు కూలీల రాకను ప్రోత్సహించారు. 1878లో సులు సుల్తాన్ మొత్తం అధికారాలు బ్రిటిష్ పరం చేసేవరకు సబాహ్ బ్రిటిష్ వారి క్రౌన్ కాలనీగా ఉంటూ వచ్చింది తరువాత ఉత్తర బోర్నియోకి మారింది. 1842 లో బ్రూనై సుల్తాన్ జేంస్ బ్రూక్ చేత సరావాక్ వదులి వేయబడింది. అతడిని వెన్నంటి వచ్చిన రాజులు అది బ్రిటిష్ క్రౌన్ కాలనీగా మారేవరకు తెల్లరాజాలుగా 1946 వరకు స్వతంత్రంగా రాజ్యపాలన చేసారు.
 
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా మీద దండయాత్రచేసి మలయా, సరవాక్ మరియు సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్ మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది. ఈ సమయంలో అధికమైన సంప్రదాయ సమస్యలు చివరకు జాతీయసమైక్యత అభివృద్ధికి దారితీసాయి. మిత్రసైన్యాలు మలయాను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత స్వతంత్రరాజ్య స్థాపనకు ప్రజలలో మద్దతు అధికమైంది. యుద్ధనంతరం బ్రిటిష్ మలయాను రాజ్యపాలనను సమైక్యపరచి మలయాన్ యూనియన్ పేరిట ఒకేరాజ్యంగా చేయాలని ప్రణాళిక రూపిందించింది. అయినప్పటికీ మలయా ప్రజలు ఈ ప్రతిపాదనను బలంగా వ్యతిరేకించారు. సంప్రదాయక చైనీయులకు పౌరసత్వం ఇస్తున్న మలయా పాలకులను ఈ వ్యతిరేకత బలహీనపరచింది. 1946లో మలయాన్ యూనియన్ స్థాపించబడింది. సింగపూర్ తప్ప మిగిలిన మలయా ద్వీపకల్పంలో ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం రద్దు చేసి బ్రిటిష్ సైనిక రక్షణతో స్వతంత్ర
Line 91 ⟶ 90:
మలేషియా రాజ్యాంగ ఎన్నిక రాచరికం అనుసరిస్తుంది. మలేషియా ప్రభుత్వ విధానం బ్రిటిష్ కాలనియల్ పాలనా విధానాలలో ఒకటి అయిన వెస్ట్ మినిస్టరీ పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది.
రాష్ట్ర అధ్యక్షుడైన " యాంగ్ డి-పెర్తుఆన్ అగాంగ్ " ను సాధారణంగా రాజుగా భావిస్తారు. మలేషియా రాష్ట్రాల 9 వారసత్వ పాలకుల నుండి 5 సంవత్సరాలకు ఒకసారి రాజును ఎన్నుకుంటారు.
మిగిలిన 4 రాష్ట్రాలకు గౌరవ పాలకులుగా గవర్నర్లు నియమించబడతారు. వీరు రాజు ఎన్నికలో పాల్గొనరు. 2011 నుండి అబ్దుల్ హలీం ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం కారణంగా వారసత్వ పాలకులైన 9 మంది ఒకరి తరువాత ఒకరు రాజుగా ఎన్నుకొనబడతారు. 1994 లో రాజ్యాంగ విధానంలో మార్పులు చేసిన తరువాత రాజు ప్రభుత్వంలో గౌరవార్ధం నియమించబడతాడు. అప్పర్ హౌస్ నుండి మంత్రులను ఎన్నిక చేస్తారు.
 
రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కేంద్రప్రభుత్వానికి కొంత చట్టం అమలు చేసే అధికారాలు విభజించబడి ఉంటాయి. రెండు సభలు కలిగిన పార్లమెటు విధానంలో దిగువ సభలో ప్రజాప్రతినిధులు అప్పర్ సభలో సెనేట్ సభ్యులు పాల్గొంటారు. ఒక్కో నియోజక వర్గం నుండి ఒక్కొకరు అన్న విధానంలో 5 సంవత్సరాలకు ఒకసారి దిగువసభకు 222 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. 70 మంది సెనేట్ సభ్యులు 3 సంవత్సరాల కాలం పనిచెయ్యడానికి నియమించబడతారు. 26 మంది సెనేట్ సభ్యులు 13 రాష్ట్రప్రభుత్వాల అసెంబ్లీల నుండి ఎన్నుకొనబడతారు. మిగిలిన 44 మంది సెనేట్ సభ్యులు ప్రధానమంత్రి సలహాతో రాజుచేత నియమించబడతారు. పార్లమెట్ మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి మలేషియా బారిసన్ నేషనల్ అనబడే మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది.
 
రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే శాసనసభ విధానం అనుసరిస్తుంది. రాష్ట్ర శాసనసభకు ప్రతినిధులను నియోజక వర్గం నుండి ఎన్నుకొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వలను పాలనావ్యవహారాల బాధ్యత వహిస్తారు. అధిక సంఖ్యలో శాసనసభా సభ్యులు కలిగిన పార్టీ నుండి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రాలకు పాలకులుగా మలాయ్ వారసత్వ ప్రాతిపదికన నియమించబడతారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 21 సంవత్సరాలు నిండిన నమోదుచేయబడిన పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఓటింగ్ నిర్భంధం కాదు.
 
ప్రధానమంత్రి నాయకత్వంకోలోని మంత్రివ్ర్గానికి ప్రభుత్వనిర్వహణ అధికారం ఉంటుంది. ప్రధానమంత్రి తప్పకుండా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులున్న
Line 102 ⟶ 101:
 
మలేషియా చట్టవిధానం ఇంగ్లీష్ బేసిక్ ఆధారంగా రూపొందించబడింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ జవాబుదారీ బాధ్యత కలిగి ఉంటుంది. న్యాయమూర్తి నియామకత్వం జవాబుదారి మరియు పారదర్శకంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో ఉన్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్ట్ తరువాత కోర్ట్ ఆఫ్ అప్పీల్ మరియు రెండు హై కోర్టులు ఉంటాయి. ఒకటి మలేషియా ద్వీపకల్పంలో మరొకటి తూర్పు మలేషియాలో ఉంటుంది. మలేషియాలో రాచరిక వ్యవస్థ వచ్చే ఫిర్యాదులు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది. షరియా న్యాయస్థానాలు సివిల్ న్యాయస్థానాల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కోర్టులు మలేషియన్ ముస్లిములకు షరియా చట్టం అనుసరించి తీర్పులు ఇస్తుంటుంది.
ఇవి సెక్యులర్ న్యాయస్థానాలకు సమాంతరంగా పనిచేస్తుంటాయి. దేశాంతర్గత రక్షణ చట్టం విచారణ లేకుండా నిర్భంధించడాన్ని అనుమతిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకం వంటి విషయాలలో మరణశిక్ష విధించబడుతుంది.
 
మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మలయన్లకు ప్రత్యేత ఇవ్వడం మరియు అసలైన మలేషియా వారసులని భావించబడుతున్న స్థానిక గిరిజనులకు ప్రత్యేకత ఇవ్వడం వంటి చర్యలతో నేషనల్ డెవలప్మెంట్ పాలసీ ఒక అడుగు ముందుకు వేసింది. భూమిపుతేరాకు చెందని చైనా మరియు భారతీయ వంశావళి వారికంటే మిగిలిన మలేషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. ఈ విధానాలలో భూపుతేరా ప్రజలకు ఉద్యోగాలు, విద్యావసతులు, ఉపకారవేతనాలు, వ్యాపారం మరియు చౌకైన గృహవసతి మరియు పొదుపు పధకాలు భాగం వహిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు సంప్రదాయ ప్రజల మధ్య తీవ్రమైన అసహనానికి కారణం ఔతుంది. మలేషియా ప్రభుత్వం విధానాలు మతాతీత విధానలను ప్రతిఫలిస్తున్నాయా లేక ఇస్లాం విధానాలను ప్రతిఫలిస్తున్నాయా అన్న విషయం మీద వివాదాలు తలెత్తుతున్నాయి. పాన్-ఇస్లామిక్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిలిపివేసింది.
=== సైన్యం విదేశీవిధానాలు ===
ఆగ్నేషియా దేశాలు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ నిధివితరణ సభ్యత్వం కలిగిన మలేషియా నుండి ప్రతినిధులు ఐఖ్యరాజ్య సమితి, ది ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్, ది డెవలపింగ్ 8 కంట్రీస్ మరియు నాన్ అలైండ్ మూవ్మెంట్ మొదలైన సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. పూర్వ బ్రిటిష్ కాలనీగా 2005 లో కామంవెల్త్ దేశాల సమ్మేళనం మలేషియాలోని కోలాంపూరులో జరిగింది. మలేషియా విదేశీ విధానం పక్షపాతరహితం మరియు అన్ని దేశాలతో శాతియుత విధానం వహిస్తూ ఉంటుంది. దక్షిణాసియా రక్షణ మరియు స్థిరత్వానికి మలేషియా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ప్రాంతీయ దేశాలతో సంబాధాలను మరింత బలపరచడాన్ని కోరుతూ ఉంటుంది. చారిత్రకంగా మలేషియా ప్రభుత్వం తనను ఇస్లామిక్ దేశంగా పేర్కొటున్నది. అలాగే ఇతర ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను బలపరుస్తూ ఉంది. మలేషియా దేశసార్వభౌమాధికారం మరియు దేశీయ వ్యవహారాలను తన అధీనంలో ఉంచడానికి ముఖ్యత్వం ఇస్తుంది.
 
మలేషియా ప్రభుత్వం పొరుగుదేశాలతో భూభాగ వివాదాలను పరిష్కరించడానికి శక్తియుక్తులు ఉపయోగిస్తుంది. మలేషియా భూవివాదాల పరిస్కారానికి అనుసరిస్తున్న పలు విధానాలలో ప్రభుత్వం వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకువెళ్ళడం ఒకటి. 2002 లో దక్షిణ చైనా సముద్రంలో కాందక్ట్ ఆఫ్ పారిస్ ప్రకటనతో అనేక రాష్ట్రాల మధ్య తలెత్తిన స్పార్ట్లీ ద్వీపాల వివాదాలలోవెసులుబాటు కనిపించింది. 2008లో బ్రూనై మరియు మలేషియా భూవివాదాలకు ముగింపు పలికి సముద్రజల సరిహద్దుల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఫిలిప్పైంతో ఉన్న సబాహ్ వివాదం పరిస్కరించబడలేదు. సింగపూర్ భూపునరుద్ధరణ విషయంలో ఇరు దేశాలనడుమ ఘర్ణణలు తలెత్తడానికి కారణమైనది. ఇండోనేషియా సముద్రజలాల సరిహద్దుల వివాదాలు ఇంకా సజీవంగా ఉన్నాయి.
Line 133 ⟶ 132:
 
=== సంరక్షణా వివాదాలు ===
వ్యవసాయం కొరకు మరియు కొయ్య కొరకు చెట్లు నరికివేసిన కారణంగా దేశంలోని వృక్షసంపద చాలావరకు నాశనం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% కనుమరుగైంది. చెట్ల నరికివేత కారణంగా తూర్పుమలేషియా వరదలతో తీవ్రంగా బాధపడింది. మలేషియా ద్వీపకల్పంలో వృక్షాలు 60% కనిపించకుండా పోయాయి. ప్రస్థుత రీతులో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి మలేషియా అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. జంతువులకు, శీలీంద్రాలకు మరియు మొక్కల జీవనానికి అననుకూల వాతావరణం ఏర్పడింది. అడవులను నరికి తోటల పెంపకానికి ముఖ్యతం ఇస్తున్నారు. ప్రస్థుతం ఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు పరిమితం అయింది. నివాసప్రదేశనాశనం సముద్రజీవుల జీవితశైలిని ఆపదకు గురి చేస్తున్నది. చట్టవిరోధమైన చేపలవేట చేపలవేటలో ఉపయోగించే డైనమైట్ మరియు పాయిజనింగ్ వంటివి సముద్రజీవుల క్షీణతకు కారణం ఔతుంది.
 
వ్యవసాయం మరియు కొయ్య కొరకు అడవులను నరికివేయడం వృక్షసంపదకు నష్టం వాటిల్లడమే కాక దేశపర్యావరణం కలుషితమవడానికి కారణం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% నాశనం అయ్యయి. అరణ్యాలు నరికివేత వలన తూర్పు మలేషియా వరదలతో తీవ్రనష్టాలను చవిచూసింది. మలేషియా ద్వీపకల్ప అరణ్యాలలో 60% కనపించకుండా పోయాయి. ప్రస్థుత రీతిలో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. అరణ్యల నరికివేసి తోటల పెంపకానికి ముఖ్యత్వం ఇవ్వడం జంతువులకు, శీలీంద్రాలు మరియు మొక్కల జీవనశైలికి పెద్ద సమస్యగా మారింది. ప్రస్థుతం మిగిలిఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు మాత్రమే పరిమితమైంది. నివాసప్రాంతాల నాశనం సముద్రజీవులను ప్రమాదానికి గురిచేసింది.
Line 142 ⟶ 141:
ఫెడరల్ ప్రభుత్వం సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో అరణ్యాల పరిరక్షనిమిత్తం తూర్పు మలేషియాలో 23 మరియు మలేషియా ద్వీపకల్పంలో 5 మొత్తం 28 నేహనల్ పార్కులు స్థాపించబడ్డాయి. సిపడాన్ దీవుల వంటి ప్రదేశాలలో పర్యాటకుల రాకను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. జంతువుల రవాణా పెద్ద సమస్యగా భావించబడుతుంది. మలేషియా ప్రభుత్వం బ్రూనై మరియు ఇండోనేషియా ప్రభుత్వాలతో చర్చింది జంతువుల రవాణా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
== ఆర్ధికం ==
మలేషియా స్వేచ్చ విఫణి మరియు కొత్తగా పారిశ్రామిక వాణిజ్యం కలిగిన దేశం. మలేషియా ప్రభుత్వం దేశం యొక్క స్థూలమైన ఆర్ధికప్రగతికి గుర్తించ తగిన పాత్ర వహించింది. ఆసియాలో ఉత్తమ ఆర్ధిక ప్రగతి సాధించినదేశాలలో మలేషియా ఒకటి. మలేషియా 1957 నుండి 2005 వరకు సంవత్సరానికి సరాసరి 6.5% జి.డిపి. అభివృద్ధి సాధించింది. 2011 లో జి.డి.పి అభివృద్ధి 45000 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది ఆదియా ఆర్ధిక ప్రగతిలో 3 వ స్థానం, ప్రపంచ ఆర్ధిక ప్రగతిలో 29వ స్థానం. 1991 లో మలేషియా ప్రధాని మహాదిర్ బిన్ మొహమ్మద్ తన భవిస్యత్దర్శన వివరణలో 2020 నాటికి మలేషియా పారిశ్రామిక రంగంలో స్వయంసమృద్ధి సాధించగలదన్న ఆశాభావం వ్యక్తపరిచాడు. ప్రభుత్వ మంత్రి అయిన " తాన్ స్రి నార్ మొహమ్మద్ " మలేషియా అభివృద్ధి చెందిన దేశానికి అవసరమైన సకలవసతులను కలిగి ఉన్నదని ఉద్ఘాటించాడు.
 
1970 లో గనులు మరియు వ్యవసాయ ఆధారిత ఆర్ధికాభివృద్ధి విభిన్న రంగాలకు చెందిన ఆర్ధిక ప్రగతిగా రూపాంతరం చెందడం మొదలైంది. 1980 నుండి పాతిశ్రామిక ప్రగతి మలేషియా ఆర్ధికరంగాన్ని ముందుకు నడిపించింది. అధికమొత్తంలో పెట్టిన పెట్టుబడులు ఇందులో ప్రధాన పాత్రవహించాయి. 1997 ఆసియన్ ఆర్ధిక పతనం నుండి మలేషియా ఆర్ధిక రంగం పొరుగు దేశాలకంటే ముందే కోలుకుని ఆర్ధికపతనానికి ముందున్న తలసరి 14,800 అమెరికన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. వివిధ సంప్రదాయ ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు ఉన్నాయి. దేశజనాభాలో మూడవ వంతు ఉన్న చైనీయుల పెట్టుబడులలో 70% ప్రగతిని సాధించారు.
 
మలేషియాను ఆనుకుని ఉన్న మలక్కా స్ట్రెయిట్ అంతర్జాతీయ వాణిజ్యానికి అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. మలేషియా సహజ మరియు వ్యవసాయ వనరులను ఎగుమతి చేస్తుంది.
Line 153 ⟶ 152:
=== మౌలిక నిర్మాణాలు ===
అసియాలో అత్యంత అభివృద్ధి చేందిన దేశాలలో మలాఏషియా ఒకటి. మలేషియా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దక్షిణాసియా దేశాలలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానం సింగపూర్‌కు దక్కుతుది. మలేషియా ఫిక్సెడ్ లైన్ చందాదారుల సంఖ్య 4.7 కోట్లు. అలాగే సెల్యులర్ చందాదారుల సంఖ్య 3 కోట్లు. దేశంలో 7 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది పోర్ట్‌క్లాంగ్. దేశంలో 200 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వీటిలో టెక్నాలజీ పార్క్ మలేషియా మరియు కులిమ్- హైటెక్ పార్క్ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ప్రజలలో 95% ప్రజలకు మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. కాలనీరాజ్య కాలంలో ఆర్ధిక ప్రాముఖ్యత కలిగిన నగరాలు మరియు రక్షణ అవసమైన ప్రాంతాలు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించబడింది.
గ్రామప్రాంతాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయబడినప్పటికీ అవి ఇంకా వెనుకబడిన ప్రాంతాలుగానే పరిగణించబడుతున్నాయి. మలేషియా ద్వీపంలోని పడమటి తీరప్రాంతం ఇందులో ఒకటి. నగరప్రాంత టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ శక్తివంతంగా ఉన్నప్పటికీ గ్రామవాసులకు వసతుల కొరత ఉంది.
 
మలేషియా రహదారుల పొడవు 98,721 కిలో మీటర్లు. ఇదికాక దేశంలో అత్యంత పొడవైన 1,821 కిలోమీటర్ల పొడవున్న నార్త్-సౌత్ ఎక్స్‌ప్రెస్ వే అదనం. 800 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే తాయ్ సరిహద్దుల నుండి సింగపూర్ వరకు ఉంటుంది. తూర్పు మలేషియా రహదార్లు మలేషియా ద్వీపకల్ప రహదార్లకంటే నాణ్యతలోను అభివృద్ధిలోను తక్కువ స్థాయిలో ఉంటాయి. మలేషియాలో 118 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 38 విమానాశ్రయాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మలేషియా అధికారిక విమానాశ్రయం దేశీయ మరియు అంతర్జాతీయ విమానసేవలందిస్తున్న మలేషియా ఎయిర్ లైన్ విమానాశ్రయం. ఈ విమానశ్రయం కార్గో సేవలు కూడా అందిస్తుంది.
 
మలేషియాలో రైల్వే మార్గాల పొడవు 1,849 కిలోమీటర్లు. [[కోలాలంపూర్]] వంటి నగరాలలో లైట్ రైల్ ట్రాంస్ పోర్ట్ సిస్టం పనిచేస్తుంది. కోలాంపూర్ నుండి సింగపూర్ వరకు ఉన్న రైల్ మార్గం ది ఆసియన్ రైల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తుంది. ఈ మార్గాన్ని సింగపూర్ నుండి చైనా వరకు నిర్మించాలని యోచిస్తున్నారు.
 
మలేషియా సంప్రదాయక విద్యుత్తు చమురు మరియు సహజవాయు ఆధారితమైనది. దేశం 13 గిగాబైట్ల విద్యుత్తును ఉత్పత్తుచేసే శక్తి కలిగి ఉంది. అయినప్పటికీ దేశంలోని సహజవాయువుల నిలువలు 33 సంవత్సరాకు సరిపోతుంది. చమురు నిలువలు 19 సంవత్సరాల విద్యుత్తు అవసరాలను తీర్చగలవు. విద్యుత్తు అవసరాలు అధికమౌతున్న కారణాన మలేషియా కొత్త వనరుల అభివృద్ధికి కృషిచేస్తుంది. 16% విద్యుత్తు హైడ్రోఎలెక్ట్రిక్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. మిగిలిన 84% విద్యుత్తు దర్మల్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. ది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధీన సంస్థ అయిన పెట్రోనాస్ అధిగమించింది. ది ఎనర్జీ కమీషన్ ఆఫ్ మలేషియా నియంత్రణలో విద్యుత్తు రంగం పనిచేస్తుంది.
 
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
మలేషియా నైన్స్ విధానాలను మినిస్ట్రీ అఫ్ నైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ శాఖ నియంత్రిస్తుంది. సెమీకండక్టర్ డివైసెస్,ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇఫర్మేషన్ ఆండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచదేశాలలో మలేషియా ఒకటి. 1996 లో మలేషియా మొదటి ఉపగ్రహ ప్రయోగం చేసింది. మీశాట్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి. ఎన్. బి.హెచ్.డి (ముందుగా ఈ సంస్థ బినారియాంగ్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి.ఎన్. బి.హెచ్.డి) అనే ప్రైవేట్ సంస్థ బోయింగ్ శాటిలైట్ సిస్టం నుండి మీశాట్-1, మీశాట్-2, మీశాట్-3 మరియు మీశాట్-3ఎ. మలేషియా ప్రభుత్వం వీటిని వరుసగా 2006 మరియు 2009 లో రోదసీలో ప్రవేశపెట్టింది. మలేషియా స్వయంగా టియుంగ్‌శాట్-1 పేరుతో రిమోట్ సెంసింగ్ శాటిలైటును విజయవంతంగా రూపొందించింది. ఈ శాటిలైట్ రూపకల్పనకు మలేషియా ఆస్ట్రో టెక్నాలజీ ఎస్.డి.ఎన్ బి.హెచ్.డి (ఏ.టి.ఎస్.డి) (మలేషియా), మరియు సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ (యునైటెడ్ కింగ్‌డం) సహకారంతో రూపొందించింది. 2000 లో ఈ శాటిలైటును భూమి దిగువ కక్ష్యలో బైకనుర్ కాస్మోడ్రోం (కజకిస్థాం)వద్ద ప్రవేశపెట్టారు. మలేషియా రెండవ సెంసిటివ్ ఉపగ్రహం " రజాక్ శాట్ " ను 2009 జూలై 14 న రోదసీలో ప్రవేశపెట్టారు. రజాక్‌శాట్-2 ఉపగ్రహం 2015న రోదసీలో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేయబడింది. 2002 లో తన స్వంత రోదసీ పరిశోధనను ఆరంభించింది. 2006 న రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ తో జరుగిన పలు బిలియన్ల వ్యాపారానికి బదులుగా రష్యా ప్రభుత్వం ఒక మలేషియన్ పౌరుడిని అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి పంపింది. 1970లో మలేషియా స్వీయ రక్షణ సామర్ధ్యంసామర్థ్యం సాధించడానికి కొన్ని సైనిక వసతులను ప్రైవేటీకరణ చేసింది. ఇందు వలన మలేషియా స్వయం రక్షణశక్తిని సాధించడానికి తోడ్పడింది. ప్రభుత్వం ఈ పరిశ్రమలకు నిరంతర సహకారం అందిస్తూ మార్కెటింగ్ ఏక్టివిటీ, పోటీ తత్వం ప్రోత్సహిస్తుంది.
 
== గణాంకాలు ==
2010 గణాంకాలను అనుసరించి మలేషియా జనసంఖ్య 2,83,34,135. మలేషియా జనసాంద్రతలో ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మలేషియాలో పలు సంప్రదాయాల ప్రజలు నివసిస్తున్నారు. మలేషియాలో మలయా ప్రజల శాతం 50.4%, భూమిపుతేరా ప్రజల శాతం 11%, ఉన్నతు. మలయా ప్రజలు మలయా సంప్రదాయాలు మరియు సంకృతిని అవలంభిస్తున్న ముస్లిం మతానికి చెందినవారు. వారు రాజకీయంగా ఆధిఖ్యత కలిగి ఉన్నారు. భూమిపుతేరా ప్రజలు మలయాకు చెందని స్థానిక హోదా కలిగి ఉన్నారు. తాయ్స్, ఖేమర్లు, చాంస్ మరియు స్థానిక సబాహ్, సారవాక్ ప్రజలు మలేషియన్ ప్రజలలో భాగమే. సారవక్‌లో సగానికి పైగా సబాహ్‌లో మూడింట రెండు వంతుల ప్రజలు మలాయాకు చెందని భూమిపుతేరా ప్రజలు ఉన్నారు. మలేషియా ద్వీపకల్పంలో స్వల్పంగా ఉన్న ఆదివాసులను ఔరాంగ్ అస్లి అని అంటారు.
 
భూమిపుతేరా అంతస్థు పొందని ఇఅతర అల్పసంఖ్యాకుల శాతం 23.7%. చైనా వారసత్వ ప్రజలు, భారతీయ వారసత్వ ప్రజల శాతం 7.1%, చైనీయులు చారిత్రకంగా వాణిజ్య ఆర్ధిక రంగాలలో ఆధిఖ్యత కలిగి ఉన్నారు. పెనాంగ్‌లో చైనీయులు బహుళ సంఖ్యలో ఉన్నారు. 19వ శతాబ్ధంలో మలేషియాకు భారతీయుల వలస ప్రారంభం అయింది. భారతీయ ప్రజలలో అత్యధికులు తమిళులు. మలేషియాలో పుట్టినంత మాత్రాన మలేషియన్ పౌరసత్వం లభించదు. అయినప్పటికీ మలేషియా వెలుపలి దేశాలలో నివసిస్తున్న భార్యాభర్తలకు పుట్టిన పిల్లలకు మలేషియా పౌరసత్వం లభిస్తుంది. రెడు దేశాల పౌరసత్వానికి దేశంలో అనుమతి లేదు. మలేషియన్ ద్వీపకల్పంకంటే మలేషియన్ బోర్నియో, సారవాక్ మరియు సబాహ్ రాష్ట్రాలలో పౌరుల వలసవిధానంలో నిబంధనలు మారుతుంటాయి. మలేషియాలోని ప్రతిపౌరుడికి 12 సంవత్సరాల తరువాత " మైకాడ్ " అనే బయోమెట్రిక్ స్మార్ట్ చిప్ గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు కార్డును పౌరులందరూ అన్ని సమయాలలో దగ్గర ఉంచుకోవాలి.
Line 185 ⟶ 184:
 
== సంస్కృతి ==
మలేషియా విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయ మరియు విభిన్న భాషా సమ్మేళిత ప్రజలు కలిగిన దేశం. మలేషియాలో ఒకప్పుడు నివసించిన ప్రస్తుతం తరలించబడిన పురాతన గిరిజన జాతుల సంస్కృతి మూలకేంద్రంగా చెప్పుకోవచ్చు. మలయాలో విదేశీ వ్యాపారులు ప్రవేశించిన తరువాత చైనీయులు మరియు భారతీయ సంస్కృతి ప్రభావం ప్రస్థుత మలేషియాలో గుర్తించతగినంతగా కనిపిస్తుంది. పర్షియన్, అరబిక్ మరియు బ్రిటిష్ వంటి ఇతర సంస్కృతులు కూడా మలేషియా సంస్కృతిలో ఒక భాగమే. ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న సాంఘిక సమైక్యత కారణంగా అల్పసంఖ్యాక సంప్రదాయ ప్రజలు అధికసంఖ్యాక సప్రదాయ ప్రజలు సమైక్యత సాధ్యమైంది.
 
మలేషియా సంస్కృతిలో ప్రభావశీలమైన స్థాయిలో భారతీయ సంస్కృతి, మతం, నైతిక, ఆర్థికాది వ్యవహారాల్లో భారతదేశపు ప్రభావం కనిపిస్తోంది. ప్రాచీన హిందువులు పశ్చిమంలో ఆఫ్రికా ఖండపు మొడగాస్కర్ దీవి నుంచి మొదలుకొని తూర్పున మలేషియా మీదుగా జావా, సుమత్రా ద్వీపాల వరకూ వ్యాపారం విస్తరించారు. మతం, నైతికత, ఆర్థికం, జ్యోతిష్యం, గణితం మొదలైన విషయాల్లో వారి సాంకేతిక పదాలు సంస్కృత పదాల్లోనే ఉపయోగిస్తుంటారు. హిందూమతస్తులు ఇక్కడ విస్తరించివున్నారు. అనేక విధాలుగా హిందూనాగరికతను అనుభవించారు.<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972|accessdate=9 December 2014}}</ref>
 
1971లో ప్రభుత్వం మలేషియన్ సంస్కృతి నిర్వచనంతో " జాతీయ సంస్కృతిక విధానం " తయారుచేసింది. ఈ విధానంలో ఈ భూభాగంలో నివసించిన పురాతన స్థానికుల సంస్కృతి ఆధారంగా మలేషియన్ సంస్కృతి ఉండాలని అలాగే ఇతర సంస్కృతాల నుండి తగిన విధానలను కలుపుకోవాలని మరియు ఇస్లాం తప్పక సంస్కృతిలో ప్రధాన పాత్ర వహించాలని స్పష్టమౌతుంది. అలాగే ఈ విధానాలలో మలయా భాష కూడా ఇతరభాషలలో ఒకటిగా ఉండాలని ప్రతిపాదించింది. మలయాపూర్వీకతకు చెందని ప్రజలలో ప్రభుత్వ జ్యోక్యం కొంత అసహనం సృష్టించింది. ప్రభుత్వ జోక్యం తమ సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని తగ్గిస్తుందని భావించారు. భారతీయులు మరియు చైనీయ అసోసేషన్లు ఇది అప్రజాస్వామికమని సూచిస్తూ ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది.
 
మలయా మరియు పొరుగు దేశాలతో ఉన్న కొన్ని సంస్కృతిక వివాదాలు తొలగిపోయాయి. ప్రత్యేకంగా ఇండోనేషియాతో ఉన్న విభేధాలు తొలగాయి. రెండు దేశాల సంస్కృతి ఒకేలా ఉంటుంది. ఇరుదేశాలు సంస్కృతిక మరియు సంప్రదాయక అంశాలను పరస్పరం పంచుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ ఆహార విధానాలు మరియు జాతీయగీతం వంటి విధానాలలో వివాదాలు తలెత్తాయి.
Line 197 ⟶ 196:
 
మలాయ్ సంప్రదాయక సంగీతం మరియు కళలు మలేషియా లోని కేలత్తాన్ - పట్టాని ప్రాంతాలకు చెందినది. ఈ కళలు భారతదేశం, చైనా, తాయ్‌లాండ్ మరియు ఇండోనేషియా ప్రభావితమై ఉంటాయి. ఈ సంగీతానికి ఆధారంగా సంగీతసాధనాలు మీటబడుతుంటాయి. సంగీతసాధనాలలో జండాంగ్ (డ్రం) కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మలేషియన్లు 14 రకాల సంప్రదాయక డ్రంలను ఉపయోగిస్తారు. డ్రం మరియు ఇతర సంగీతసాధనాలు సహజసిద్ధంగా లభించే వస్తువులతో తయారు చేస్తారు. మలయా ప్రజలు సంగీతం సంప్రదాయకంగా కథను చెప్పడానికి, జీవితచక్రంలో జరిగే ప్రత్యేక సందర్భాలలో మరియు పంటచేతికి వచ్చే కాలంలో ఒకభాగంగా ప్రదర్శించబడుతుంది. ఈ సంగీతం ఒకప్పుడు దూరంలో ఉన్నవారుకి సంకేతం అందించడానికి ఉపయోగించేవారు.
వివాహసమయాలలో మరియు మరణానంతర సంప్రదాయాలలో అగంగ్ మరియు కులింతాంగ్ బృంద సంగీతాలు చోటుచేసుకుంటాయి. పొరొగు భూభాలైన ఫిలిప్పైంస్, [[ఇండోనేషియా]]లోని కలిమంతన్ మరియు [[బ్రూనై ]] ఈ బృందసంగీతాలు సహజమే.
 
మలేషియాకు శక్తివంతమైన గాత్రసంగీత సప్రదాయం ఉంది. లిపి అక్షరాలు వ్రాత ఈ భూగంలో ప్రవేశించడానికి ముందే గాత్రసంగీతం జీవం పోసుకున్నది. ఒక్కో సుల్తానేటుకు వారి స్వంత సాహిత్యం ఉంది. అలాగే గతంలో జరిగిన సంఘటనల ఆధారిత కథలు మరియు ఇస్లాం నుండి వచ్చిన కథలు లిపిరూపంలోకి రాక మునుపు శబ్ధరూపంగా చెప్పబడేవి. మొదటి మలయ్ సాహిత్యం అరబిక్ భాషలో వ్రాయబడింది. 1303లో తెరెంగను రాయి మీద చెక్కబడిన శలాశాసనం మొదటి మలాయ్ శిలాశాసనంగా భావిస్తున్నారు. భారతీయ మరియు చైనా సాహిత్యం మలేషియాలో అత్యధికులచే చదవబడుతున్నది. భారతీయ మరియు చైనా మాట్లాడే ప్రజల సంఖ్య క్రమక్రమంగా అధికరిస్తూనే ఉంది. 19వ శతాబ్ధం నుండి సాహిత్యం దేశంలోనే ముద్రించబడుతుంది. సాధారణంగా ముద్రించబడే సాహిత్యంలో ఆంగ్లభాష కూడా ఒకటి. 1971లో మలయా ప్రభుత్వం దేశీయ భాధలను నిర్వచించే చర్యలను చేపట్టింది. మలయా భాషలో ముద్రించబడుతున్న సాహిత్యం " లిట్రేచర్ ఆఫ్ మలయా " గా గౌరవించబడుతుంది. ఇతర భూమిపుత్రా భాషా సాహిత్యం " రీజనల్ లిటరేచర్ " అంటారు. ఇతర భాషా సాహిత్యాన్ని " సెక్టోరియల్ లిటరేచర్ " అంటారు. మలాయ్ కవిత్వం అత్యధికంగా అభివృద్ధి చెందింది. కవిత్వాన్ని మలయాలో పలు రూపాలలో వాడుతుంటారు. ది హికయత్ రూపం ప్రజాదరణ పొందింది. పంటన్ కవిత్వం మలయా నుండి ఇతర భాషలకు విస్తరించింది.
=== ఆహారం ===
మలేషియా ఆహారసంప్రదాయంలో అక్కడి విభిన్న ప్రజలసంప్రదాయం ప్రతిబింబింస్తుంది. దేశంలోని విభిన్న సంప్రదాయాలు పొరుగు ప్రాంతాల సంప్రదాయాలు ఆహారసంస్కృతి మీద తగినంత ప్రభావం చూపుతుంది. అధిక ప్రభావం మలాయ్, చైనా, భారతదేశం, తాయ్, జాపాన్ మరియు సుమత్రా దేశప్రజల ఆహారసంస్కృతి ప్రతిబింబిస్తుంది. దేశంలో ఆహారసంప్రదాయంలో అధికంగా ఆసియన్ ఆహారసంప్రదాయంలో భాగమైన స్పైసీనెస్ ఒక భాగంగా ఉంటుంది. ఆహారాల తయారీ [[ సింగపూర్ ]] మరియు [[బ్రూనై ]] ఆహారాలను పోలి ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్ ఆహార పద్ధతులు
మలయా ఆహార విధానాలలో ఒక భాగమే. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆహారవిధానం కనిపిస్తుంది. తరచుగా మలేషియా ఆహారపదార్ధాలు స్థానిక ఆహారాలకు వ్యత్యాసంగా ఉంటుంది.
 
Line 212 ⟶ 211:
=== పండుగలు, సెలవు దినాలు ===
మలేషియాలో సంవత్సరం పొడవునా పలు పండుగలు మరియు పలు సెలవు దినాలు ఉండడం గమనించవచ్చు. కొన్ని ప్రభుత్వం మంజూరు చేసే సెలవు దినాలు, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక సెలవు దినాలు. ఇతర పండుగలు ప్రత్యేక సంస్కృతి మరియు సాంప్రదాయాలకు చెందినవి. ప్రధాన సాంప్రదాయక ప్రజలు అతిముఖ్యమైన పండుగను సెలవుదినంగా ప్రకటిస్తారు.
అత్యంత ప్రధానమైన ప్రభుత్వ సెలవు దినం ఆగష్టు 31 వ తేదీ హరీ మర్డెకా (స్వతంత్ర దినం). 1957న స్వాతంత్ర్యం లభించినదానిని గుర్తుచేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు. మలేషియా దినం సెప్టెంబరు 16. ఫెడరేషను గా ఏర్పడిన 1963 సెప్టెంబరు 16 గుర్తుగా జరుపుకుంటారు.
 
రాష్ట్రీయ మతమైన ముస్లిం సెలవుదినాలకు ప్రత్యేకత ఉన్నది. హరిరాయ పుయాషా (హరి రాయ ఐదిల్ ఫిత్రి) హరి రాయ హజీ ( హరిరాయ ఐదిలాధా), మైలీ దర్ రసూల్ (ప్రవక్త పుట్టిన రోజు),
Line 224 ⟶ 223:
{{ఓఐసి}}
{{జి -15 దేశాలు}}
 
[[వర్గం:ఆసియా]]
 
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు