భాగవతులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వైజాసత్య, పేజీ కూచిపూడి వారసులే కోట కొండభాగవతులు ను భాగవతులు కు తరలించారు: నామకరణ పద్ధతులన... |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
===భరత నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో [[కూచిపూడి]] కన్న ప్రథములు పోతక మూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు. శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళాపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపు వారనీ తెలుస్తూంది. దీనిని బట్టి భాగవత కళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూ వుంది.===
==భాగవత కళ, నావాబుల ఆదరణ==
భాగవత కళను [[రాయలసీమ]] లొ విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ:శ:. 1700 - 1759 ప్రాంతాలలో బనగాని పల్లె నవాబు గారు కూచి పూడి నుండి కొందరు కళా వేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోట కొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచి పూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, [[సిద్ధేంద్రయోగి]] నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయణ శాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించిన వారు.
కూచి పూడి వీథి భాగవతులకు గోలు కొండ నవాబు తానీషా ఎలా అగ్రహారాన్ని దానం చేశాడో అదే విధంగా కోట కొండ భాగవతులకు కర్నూలు నవాబు 200 ఎకరాల భూమి శ్రోత్రియంగా ఇచ్చారట. ఆ హక్కు ఈ నాటికి వారి అనుభవంలో వుంది. వీరి ఇలవేల్పు కౌలుట్ల చెన్న కేశవుడు. వీరి కుంటుంబంలోని ప్రతి మగపిల్ల వానికి ఐదవ ఏట ఆ దేవాలయంలో ముక్కు కుట్టిస్తారట. ఆ దేవుని ఎదుట గజ్జె కట్తించి, ప్రథమ పాటాలు ప్రారంబిస్తారట. విద్య పూర్తి కాగానే చెన్న కేశవుని సన్నిధానంలో ప్రథమ ప్రదర్శనం ఇచ్చిన అనంతరం గాని రాజుల వద్ద ప్రదర్శించే వారు కారట. వీరికి ఎక్కువ మక్కువతో అభ్యాస మైన విద్యలు, ''తరంగాలు,'' [[అష్టపదులు]] ''[[క్షేత్రయ్య పదాలు]].''
|