గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==
హైస్కూలు చదువు గూడూరు లో పూర్తిచేసి, నెల్లూరు లోని వి.ఆర్.కాలేజీలో బి.ఏ పట్ట్భద్రులయ్యారుపట్టభద్రులయ్యారు. [[ఆంధ్రప్రదేశ్]] పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయ కార్యదర్శిగా పనిచేసి, 1995లో పదవీ విరమణ చేశారు.
 
== రంగస్థల ప్రవేశం ==
పంక్తి 48:
 
== ఇతర రచనలు ==
‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’అనేనీడలు’ అనే రంగస్థల నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్‌ల స్క్రిప్ట్ రాశారు. నాటకరంగం పై సుమారు 300 వ్యాసాలు వివిధ పత్రికలకు రాశారు. తెలుగు నాటకరంగంపైన, అటు పాశ్చాత్య నాటకరంగంపైన పరిశోధన చేసి ఆధునిక తెలుగు నాటకరంగంలో 1860నుంచి 1985 వరకు వచ్చిన మార్పులు రాశారు. '''గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు డ్రామా''' అనే పేరుతో ఇంగ్లీషులో తెలుగు నాటక రచయితల రచనలపైన గ్రంథం రచించారు. మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన '''[[వరవిక్రయం]]''', '''నిజం''', '''[[గయోపాఖ్యానం]]''' పైన విమర్శనాత్మక గ్రంథాలు రాశారు.
 
ఆంధ్రదేశంలోని [[తెలంగాణా]], ఆంధ్రా [[రాయలసీమ]] జిల్లాలలోనే కాక రాష్ట్రేతర పరిషత్తుల్లో కూడా నిర్వహించిన ఎన్నో నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనేక ప్రతిష్టాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు అమెరికాలో[[అమెరికా]]లో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.
 
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారు ప్రచురించిన గ్రంథానికి సంగ్రహ సంపాదకులుగా వ్యవహరించి [[నాటక విజ్ఞాన సర్వస్వం]] అనే గ్రంథాన్నినాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు.