గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంథాలయము. దీనిని ఆంగ్లమున '''లైబ్రరీ''' (Library) అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి '''గ్రంథాలయ పితామహుడు''' అనే పేరు పొందినవాడు [[అయ్యంకి వెంకట రమణయ్య]]. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉదృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి [[వెలగా వెంకటప్పయ్య]].
== చరిత్ర ==
==అత్యంత ప్రాచీన గ్రంథాలయం==
==oldest library
[[File:Library of Ashurbanipal The Flood Tablet.jpg|thumb|''ఎపిక్ ఆఫ్ గిల్‌గమేష్''ను కలిగివున్న మట్టిపలక, ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ఉంది]]
అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో అసుర్‌బనిపాల్ గ్రంథాలయం ముఖ్యమైనది. క్రీ.పూ.668-627ల మధ్యకాలంలో అస్సీరియన్ సామ్రాజ్యాన్ని ఏలిన అసుర్‌బనిపాల్ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. అసుర్‌బనిపాల్ కాలంలో ఆయన సామ్రాజ్యం గొప్ప వైభవంతో విలసిల్లింది. విజ్ఞాన సముపార్జన, సంరక్షణ చేయాలనే దృక్పథం క్రియారూపంలోకి తెచ్చేందుకు తన సామ్రాజ్యంలోని నినెవ్ అనే ప్రాంతం(నేటి ఉత్తర ఇరాక్‌)లో గ్రంథాలయం నిర్మించారు. చిత్రలిపిలో రాయబడే మట్టిపలకల రూపంలో గ్రంథాలు ఉండేవి. మతం, రాజ్యపరిపాలన, విజ్ఞానం, కవిత్వం, వైద్యం, పౌరాణికగాథలు వంటివి ఆయా గ్రంథాల్లో రచించారు. అటువంటి వేలాది మట్టిపలకల గ్రంథాలను ఈ గ్రంథాలయంలో భద్రపరిచారు. ఈ గ్రంథాల్లో నాల్గు వేలయేళ్ల పూర్వపుదైన ''గిల్‌గమేష్'' అనే సుమేరియన్ ఇతిహాసం ప్రతి కూడా ఈ గ్రంథాలయంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు