గూడ అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
బడికి పోతున్న సమయంలో దారినపోతున్న ఒక రైతును పలకరించగా ''ఊరిడిసి పోవన్నా..ఉరిపెట్టుకోవన్నా...'' అన్న మాటలే తన తొలి పాటకు అన్న ప్రాసన చేశాయని..తను కళ్లారా చూసిన కష్టాలకు, వాటిని అనుభవిస్తున్న వారి నోట వచ్చిన మాటల స్ఫూర్తిగా పాటలల్లడం తనకు బాల్యంలోనే అబ్బిన విద్య అని ''అసలేని వానల్ల ముసలెడ్లు కుట్టుకొని..'' అనే ఆయన తొలిపాట పుట్టుకకు నేపథ్యం అదేనని అంజయ్య ప్రతి సభలోనే చెప్పేవాడు.
 
అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విప్లవోద్యమ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ పెత్తందార్ల పాలనలో పీడిత జనానికి విముక్తి లేదని, జన ఐక్యతతో ప్రజోద్యమాల ద్వారా శ్రామిక రాజ్యం స్థాపించడమే ఏకైక మార్గమని నమ్మి ఉద్యమ బాటలో పయనించాడు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్‌ హాస్టల్‌కు మకాం మార్చిన అంజన్నకు ప్రపంచ ఉద్యమాల పరిచయం ఏర్పడింది. తనలాగే జనం కోసం పాకులాడే వారు హైదరాబాద్‌ లో చాలామంది ఉన్నారని తెలుసుకున్న అంజయ్య వారందరిని కలుపుకున్నాడు. దాంతో జనంనోట విన్న పదాలనే పాటలుగా రాసి బాణీలు కట్టి అరుణోదయ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక సభ్యుడిగా తెలుగునేలంతా తిరిగాడు. ప్రజల నుండి నేర్చుకుంటూ, ప్రజల ఆలోచనల్లో మార్పుకోసం తన పాటల బీజాల్ని నాటాడు. ప్రజలలోంచి ఏరుకున్న పదాలతోనే అచ్చమైన జనం పాటలను సృష్టించి దేశ సంపదలో అందరూ భాగస్తులే, కష్టం ఒకరిదైతే కష్టమెరుగని మనిషి సుఖపడుడేందని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలోంచే 'ఊరు మనదిరా..ఈ వాడమనిదిరా'..పాటపుట్టింది.
 
==రచనలు<ref>[http://kinige.com/author/Guda+Anjaiah Books from Author: Guda Anjaiah-కినిగె.కాంలో పుస్తకాల వివరాలు]</ref>==
"https://te.wikipedia.org/wiki/గూడ_అంజయ్య" నుండి వెలికితీశారు