ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| website =
}}
 
'''ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి''' ఒక సుప్రసిద్ధ [[తత్త్వవేత్త]]. ''యూజీ'' గా సుప్రసిద్ధుడు.
 
'''ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి''' ([[జులై 9]], [[1918]] - [[2007]]) ఒక సుప్రసిద్ధ [[తత్త్వవేత్త]]. ''యూజీ'' గా సుప్రసిద్ధుడు.
 
ఆయన [[జులై 9]], [[1918]] న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[మచిలీపట్నం]] లో జన్మించాడు. [[గుడివాడ]] లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. [[దివ్యజ్ఞాన సమాజం]] కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీ కి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
 
ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. 2007 లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి తత్త్వవేత్త ఒకరున్నారని తెలుసుకున్నారు . యు.జి. తత్త్వం '' ఏదీ అసత్యము కాదు .. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది . '' జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు . దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే . ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనలే లేవన్నారు . ఆలోచన అనేది ఏ రూపం లో ఉన్నా అంగీకరించలేదు . ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు .