ఉదాహరణ వాజ్మయము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రంధ → గ్రంథ (6) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 4:
ఎనిమిది విభక్తులతో ఎనిమిది పద్యాలు, కళికలు, ఉత్కళికలు కలిగి భక్తిభావ బంధురంగా ఉండే రచనా విశేషానికి ఉదాహరణ అని పేరు. ఈ ఉదాహరణకి చివర సార్వవిభక్తంగా ఒక వృత్తం కూడా ఉంటుంది. 12వ శతాబ్దంలో [[పాల్కురికి సోమనాధుడు]] మొట్టమొదట [[బసవోదాహరణము]] అనే గ్రంథాన్ని రచించేడు. సంగీత, సాహిత్యాలను మేలవించి, మార్గదేశ, కవితలకు చక్కని సమంవయాన్ని కుదిర్చిన ఉదాహరణలు ఆంధ్రసాహిత్యంలో ధృవతారలు.
ప్రతీ ఉదాహరణలోనూ వృతము, కళిక, ఉత్కళిక అనే మూడు భాగాలు ఉంటాయి.
భాషా పరిణామానికి
సంస్కృతాలంకారికులు, " యేనకేవాపి తాలేన గద్యం పద్య సమన్వితమ్| జయేత్యుపక్రమం, మాలిన్యాది ప్రాసవిచిత్రితం | తదాహరణం నామ విభక్త్యష్టాంగ సమ్యుతం " అని ఉదాహరణను నిర్వచించేరు. అయితే ఈలక్షణానికి లక్ష్యంగా ఇంతవరకు సంస్కృతంలో ఒక ఉదాహరణ కూడా లభించలేదని పరిశోధకులు తెలుపుచున్నారు. పాల్కురికి సోమనాధుడు ప్రచారం కోసం సంస్కృతంలో వ్రాసిన ఉదాహరణ తెనుగులో రాసిన దానికి తు.చ తప్పని అనుకరణమే. [[కాళిదాసు]] [[రఘువంశం]] లోనూ, [[విక్రమోర్వశీయం]] లోనూ ఉదాహరణలను పేర్కొనడముచేత, నేడు అవి లభ్యము కానప్పటికి, సంస్కృత కవులు కూడా ఈవిధమైన కావ్యలని వ్రాసేరని మనం ఊహించవచ్చును.
పంక్తి 12:
నేడు తెలుగులో లభించిన ఉదాహరణ కావ్యములు దేశ కవితకు అలంకార భూతములు అయినా, వాటికి సంస్కృత సంపర్కము ఉందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మార్గకవితకు ఆశ్రయమైన వృత్తాల్ని ఈరచనలలో ప్రయోగించారో అప్పుడే సంస్కృత సంపర్కము కలిగిందని చెప్పవచ్చును. ఉదాహరణలకు ఆది పురుషుడే అయిన సోమనాధుడు వృత్తలలోనూ, రగడలలోనూ విరివిగా సంస్కృత పదజాలాన్ని వాడాడు.
మాననీయులు పూజ్యపాదులు అయిన శ్రీ
తరువాత వెలసింది [[త్రిపురాంతకోదాహరణం]]. కాలక్రమేణ ఇది రెండోదైనా, రచనా కోశలములో మాత్రము ఎది అగ్రస్థానము వహిస్తుందని చాలా మంది విమర్సకుల అభిప్రాయము. దీని మూలప్రతి తంజావూరు సరస్వతీ గ్రంథ భాండాగారంలో లేకపోవడము చేత దీనిని రచియించిన వాడు "గుండయ" కవి అయి ఉంటాడని [[గిడుగు వెంకటరామమూర్తి]] పంతులుగారు మొదట భావించారు. అటుపై దీనిని పరిశీలించిన [[నిడదవోలు వెంకటరావు]] పంతులుగారు ఈ గ్రంథము [[రావిపాటి త్రిపురాంతకుడు]] వ్రాసాడని, అతని వాడుక పేరు తిప్పన్న అని నిర్ధారణ చేసారు. ఈకవి 14వ శాతాబ్దములో జీవించాడు. మహాకవి అయిన [[శ్రీనాధుడు]] పొగడ్తకు ప్రాతుడైనాడు. ఈ ఉదాహరణనే కాకుండా రావిపాటి తిప్పన్న అంబికాశతకము, చంద్రతారావళి, సంస్కృతములో ప్రేమాభిరామం మొదలైన గ్రంథాలని రచించాడు.
అటుపై వచ్చినది [[వెంకటేశ్వరఉదాహరణము]]. దీనిని [[తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు]] వారు రచించారు. ఇది 16వ శతాబ్దములో వెలువడినది. పెదతిరుమలాచార్యులు గారు వీరి తండ్రి అయిన [[అన్నమాచార్యులు]] వారు, పెదతిరుమలాచార్యులు గారి కుమారులు చిన పెదతిరుమలాచార్యులు వారు సంగీతములో విశేష కృషి చేసిరి. దీనిలో సార్వ విభక్తిక పద్యం పూర్తి అయినాక షష్ట్యంలతో కూడిన అంకితాంక పద్యం రచించాడు. వృతాలలో వెంకటేశ్వర ప్రభావాన్ని, రగడలలో రామ కృష్ణాద్యవతారాలకు
ఈ విధంగానే మరికొందరు కవులు వ్రాసిన [[కృష్ణోదాహరణ]]
విభక్త్యాంతాల విశిష్టత ఉదాహరణ గ్రంథాలలోనే కాకుండా, మరొక విధంగా కూడా మనకు వ్యక్తమవుతున్నది. సంబోధనతో ఆశ్వాసాన్ని ప్రారంభించడం, గ్రంథ ప్రారంభానికి ముందు కృతిపతిప్రశంసలతో కూడిన షష్ట్యంతా లుండడము ప్రబంధపాఠకులకు తెలిసిన విషయమే.
|