గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., లో → లో (7), ను → ను , తో → తో (3), → using AWB |
||
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
[[1902]] వ సం.లో [[కృష్ణా జిల్లా]], [[ఉంగుటూరు, కృష్ణా|ఉంగుటూరు]] మండలములోని [[నందమూరు (ఉంగుటూరు మండలం)|నందమూరు]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు [[జ్ఞానపీఠ్ అవార్డు]] గ్రహీత, కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు [[ఇందుపల్లి]], [[గుడివాడ]], [[బందరు]] లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె
[[1924]]
▲[[1924]] లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి [[1930]] లో మూసివేయవలసి వచ్చింది. ఆయన [[1931]] లో [[అఖిలాంధ్ర రైతు మహాసభ]] ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. [[1934]] లో [[ఆంధ్ర నాటక పరిషత్]] చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ [[బళ్ళారి రాఘవ]] అధ్యక్షులు. ఆయన ''కమ్మ కుల చరిత్ర'' అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి [[కడప]]కు వెళ్ళాడు. అక్కడ ఆయన [[గండికోట]] పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి '[[గండికోట పతనం]]' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.
==ప్రజామిత్ర==
Line 48 ⟶ 47:
[[సముద్రాల రాఘవాచార్య]], [[కుర్రా సుబ్బారావు]]లు ఇతనికి సహాయపడుతుండేవారు. [[నార్ల వెంకటేశ్వరరావు]] గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత [[ఆండ్ర శేషగిరిరావు]], [[ముద్దా విశ్వనాథం]], [[బోయి భీమన్న]]లు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.
[[తాపీ ధర్మారావు]], [[వేలూరి శివరామశాస్త్రి]], [[త్రిపురనేని గోపీచంద్]] మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.
==సినిమా జీవితం==
ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి [[సారథిచిత్ర]] అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన 1934లో తీసిన [[శ్రీ కృష్ణ లీలలు]] చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత [[పి.వి.దాసు]] కలిసి రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత [[1936]]లో విడుదలైన [[ద్రౌపదీ వస్త్రాపహరణం]] సినిమాలో కూడా ఆయన పని చేశాడు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం [[మాలపిల్ల]] ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా [[1938]]
==[[మాలపిల్ల]]==
[[బొమ్మ:Telugucinemaposter malapilla 1938.JPG|right|150px]]
దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల [[ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం]]తో బాటు [[గాంధీజీ]] [[హరిజనోద్ధరణ ఉద్యమం]] కూడా జోరుగా సాగుతున్న
మాలపిల్ల చిత్రం [[కాంచనమాల]]ను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది.అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.
ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక 'నిరసన మహాసభ ' బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది.అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా "మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం" అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం [[రైతుబిడ్డ]]
Line 68 ⟶ 64:
[[బొమ్మ:Telugucinemaposter raitubidda 1939.JPG|right|150px]]
మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా [[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]] తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.
ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా [[త్రిపురనేని గోపీచంద్]] మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, [[జమీన్ రైతు]] ఉద్యమంలో [[నెల్లూరు వెంకట్రామానాయుడు]] వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు [[బి.నరసింహారావు]].
ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన [[చల్లపల్లి రాజా]] జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు.
▲ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన [[చల్లపల్లి రాజా]] జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీ లో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన [[మీర్జాపురం రాజా]] ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.
రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన [[రోజులు మారాయి (1955 సినిమా)|రోజులు మారాయి]] చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో [[తెలుగుదేశం పార్టీ]] ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. [[పల్నాటి బ్రహ్మనాయుడు]] పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి [[పల్నాటి యుద్ధం]] సినిమా తీశాడు.
Line 94 ⟶ 87:
[[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటి యుద్ధం]] ([[1947]]) దర్శకుడు
అభ్యుదయమే ఊపిరిగా జీవించిన సాహసి రామబ్రహ్మం కాగా ఈ వారసత్వాన్ని కొనసాగించిన ధీరుడు [[బి.ఎన్.రెడ్డి]].
Line 102 ⟶ 94:
==ఇతర వివరాలు==
* రామబ్రహ్మం 1942-43 మరియు 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
* రామబ్రహ్మానికి [[మధుమేహం]] వ్యాధి
* విజయవాడలో [[ఈడ్పుగంటి లక్ష్మణరావు]] కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా 'గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్' అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.
* తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో 'రామబ్రహ్మం సంస్మరణ సంఘం' ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి 'స్మారక సంచిక'ను ప్రచురించారు.
|