శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

+సమాచార పెట్టె
పంక్తి 11:
1983 లో అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాదులోని హైటెస్ సిటీ సమీపంలో స్థలం మంజూరు చేసింది.
==జనన విశేషాలు==
శోభారాజు [[1957]] [[నవంబర్ 30]] న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]]లో ఆమె జన్మించింది. ఆమె తండ్రి ప్రభుత్వోద్యోగి. తల్లి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం|url=http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 December 2016}}</ref> నాలుగేళ్ళ వయసులోనే ఆమె స్వంతంగా కూడా పాటలు పాడటం నేర్చుకున్ననేర్చుకోసాగింది. ఆమెతండ్రి ఉద్యీగరీత్యా కొద్ది రోజులు నేపాల్ లో ఉన్నప్పుడు కృష్ణుడి మీద నేపాలీ భాషలో తొలిపాట రాసింది. వయొలిన్, కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నది. పదహారేళ్ళకు ఆలిండియా రేడియోలో కళాకారిణిగా ఎంపికైంది. పదిహేడేళ్ళ వయసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తిరుపతిలో డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీవేంకటేశ్వరుని మీద భక్తితో అన్నమాచార్య కీర్తనలవైపు దృష్టి మళ్ళించింది. అప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా ఆయన కీర్తనలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు వీలుగా ఆమెకు ఉపకారవేతనం మంజూరు చేశారు. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. [[నేదునూరి కృష్ణమూర్తి]], రాజ్యలక్ష్మి మొదలైన వారి దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది.
 
==అన్నమయ్య సంకీర్తనలలో కృషి==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు