సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
యాదాద్రి-భువనగిరి జిల్లా సైదాపురంగ్రామం శివార్లో మల్లన్నబోడులు అని పిలువబడే చిన్నగుట్టలున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలు ఉండేవి. ఆ గుట్టల్లో మధ్య ఇప్పటికీ అక్కడక్కడ కైరన్ సమాధులు అగుపిస్తున్నాయి. ఆ బోడులలో ఒక బోడు మీద రామాలయం బయటపడ్డది.
 
మల్లన్నబోడులు పక్కనే వ్యవసాయం చేస్తున్న పల్లెపాటి మల్లేశ్ పశువులు తప్పిపోగా, వాటిని వెతుక్కుంటూ గుట్టపైకి వెళ్లిన ఆయనకు ఈ ఆలయం కనిపించింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు దట్టమైన కంపచెట్లను తొలగించి చూస్తే రాతిగుండ్ల కప్పుకింద రాతిగుండుకు చెక్కివున్న సీతారాములు అర్ధశిల్పం (Bas-Relief) కనిపించింది. [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు తదితర అర్చక బృందం ఆలయాన్ని సందర్శించి, విగ్రహాలు రాములవారివని తేల్చారు.<ref name="రాములోరి ఆలయం..!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=రాములోరి ఆలయం..!|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/eternal-rituals-for-seetharama-1-2-569109.html|accessdate=10 March 2018|date=8 March 2018}}</ref>
 
== మూలాలు ==