కందుకూరి వీరేశలింగం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎సంఘ సంస్కరణ కార్యక్రమాలు: అనవసరమైన లింకుల తొలగింపు
పంక్తి 40:
[[దస్త్రం:Kandukuri Veereshalingam and his Wife.jpg|right|thumb|కందుకూరి దంపతులు]]
 
==జీవిత విశేషాలు==
 
వీరేశలింగం పంతులు [[1846|1848]] [[ఏప్రిల్ 26|ఏప్రిల్ 16]] న [[రాజమండ్రి]]<nowiki/>లో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి [[ప్రకాశం|ప్రకాశం జిల్లా]] లోని [[కందుకూరు]] గ్రామం నుండి [[రాజమండ్రి]]కి [[వలస]] వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.
 
వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, [[ఆంధ్ర నామ సంగ్రహం]], [[అమరం]], [[రుక్మిణీ కళ్యాణం]], [[సుమతీ శతకం]], [[కృష్ణ శతకం]] మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో [[ఇంగ్లీషు]] చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ ([[కందుకూరి రాజ్యలక్ష్మమ్మ]]) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.
 
చదువుకునే రోజుల్లో [ కేశుబ్ చంద్ర సేన్] రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. [[విగ్రహారాధన]], [[పూజలు]] మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దెయ్యాలుదయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.
 
[[1867]]లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ [[లంచం|అవినీతి]] ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయ]] వృత్తిని స్వీకరించాడు.
వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, [[ఆంధ్ర నామ సంగ్రహం]], [[అమరం]], [[రుక్మిణీ కళ్యాణం]], [[సుమతీ శతకం]], [[కృష్ణ శతకం]] మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో [[ఇంగ్లీషు]] చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ ([[కందుకూరి రాజ్యలక్ష్మమ్మ]]) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.
 
చదువుకునే రోజుల్లో [ కేశుబ్ చంద్ర సేన్] రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. [[విగ్రహారాధన]], [[పూజలు]] మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దెయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.
 
[[1867]]లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ [[లంచం|అవినీతి]] ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయ]] వృత్తిని స్వీకరించాడు.
 
ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి [[1874]] [[అక్టోబరు]]లోఅక్టోబరులో [[వివేకవర్ధని]] అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.
 
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన [[కొక్కొండ వెంకటరత్నం పంతులు]]తో స్పర్ధ ఉండేది. కందుకూరి [[వివేకవర్ధని]] స్థాపించిన తరువాత కొక్కొండ ''[[హాస్య వర్ధని]]'' అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి ''[[హాస్య సంజీవిని]]'' అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. [[తెలుగు]]లోతెలుగులో మొదటిమొట్టమొదటి ప్రహసనంప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.
 
ఆంధ్ర దేశంలో [[బ్రహ్మ సమాజం]] స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు [[హితకారిణి]] (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు [[రాజమండ్రి]]లో [[తెలుగు]] పండితుడిగా పనిచేసి, [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.
Line 66 ⟶ 65:
వీరేశలింగం [[హేతువాది]] . ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.
 
[[వివేకవర్ధని]] పత్రిక ద్వారా [[లంచం|అవినీతి]పరులపైఅవినీతిపరులపై [[యుద్ధం]] సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. [[సంఘసంస్కరణ]] కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, [[పుస్తకాలు]], పలకా బలపాలు కొనిచ్చేవాడు.
 
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, [[కుల నిర్మూలన]]కు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.
 
ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, [[వితంతు పునర్వివాహం|వితంతు]] పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి [[వితంతు వివాహం]] చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు [[గౌరమ్మ]] తిరువూరు తాలూకా [[రేపూడి]]కి చెందిన పిల్ల. వరుడు [[గోగులపాటి శ్రీరాములు]] . ఈ [[పెళ్ళి]] పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్థులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య [[కందుకూరి రాజ్యలక్ష్మమ్మ]] (పెళ్ళయ్యాకఅత్తగారు బాపమ్మకు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు '''[[సతీహిత బోధిని]] ''' అనే పత్రికను కూడా నడిపాడు.
 
==విప్లవాత్మకమైన మార్పు==
చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష, సాహసము, విజ్ఞాన తృష్ణలు. రామమోహనరాయ్, [[దేవేంద్రనాథ్ ఠాగూర్]], కేశవ చంద్రసేన్, [[ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌]] ల బోధనలు, రచనలు ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చాడు. [[1887]] సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజము స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవం ప్రారంభించాడు. ఆయన మూఢ విశ్వాసములువిశ్వాసాలు, సనాతనాచారములపైసనాతనాచారాలపై ఆయన జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది.
 
==సాహితీ వ్యాసంగం==
Line 203 ⟶ 202:
:"వీరేశలింగం పంతులుగారు బహుయోజన శాఖా సంయుతమైన వటవృక్షము వంటి వారు. .. నేడీ దేశీయుల యొక్క సాంఘిక చైతన్యమునకు, సారస్వత వైవిద్యమునకు పంతులుగారు తమ కాలమునందు కావించిన కృషియే మూలాధారము. వారితో ఆధునిక యుగము ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును."
 
[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధిసమాధిపై పైఈ నాటికీఈనాటికీ కనిపిస్తుంది.
{{cquote|
:తన దేహము తన గేహము
Line 211 ⟶ 210:
 
 
==వనరులుమూలాలు==
{{మూలాలజాబితా}}
*అమరావతి పబ్లికేషన్సు వారి '''తెలుగు వెలుగులు''' పుస్తకం.