నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు <ref name="eenadu.net"/>. [[భూకంపం]] వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. [[2002]]లో [[గోధ్ర రైలు దహనం|గోద్రాలో]] సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
 
'''2002 ఎన్నికలు''': [[2002]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. [[2002]] గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ <ref>{{cite news | title = Don't mention the massacre | work = The Economist | date = [[December 8]], [[2007]]-12-08 | pages = 47}}</ref> సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి,<ref>{{cite web |url=http://www.indiatoday.com/itoday/20020429/cover.shtml&SET=T |title=Cover story: Narendra Modi - Face of Discord |accessdate=2007-11-16 |format=HTML |work=Swapan Dasgupta }}</ref><ref name="lb">[http://www.indianexpress.com/story/228419.html Riots+economic growth=?] Indian Express - October 15, 2007</ref> మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు.
 
'''2007 ఎన్నికలు''' : [[2007]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు <ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2007-12-24 |archive-url=https://web.archive.org/web/20120107080736/http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm |archive-date=2012-01-07 |url-status=dead }}</ref>. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009 లో భారతీయ జనతా పార్టీ తరఫున [[ప్రధానమంత్రి]] అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]] రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4 వ సారి కాగా నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం<ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2007-12-24 |archive-url=https://web.archive.org/web/20120107092837/http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm |archive-date=2012-01-07 |url-status=dead }}</ref>. గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ అన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోదీ అనీ క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది <ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2007-12-24 |archive-url=https://web.archive.org/web/20120107075254/http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm |archive-date=2012-01-07 |url-status=dead }}</ref>. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్‌ సీఎం నేనని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని నరేంద్ర మోదీ సరి కొత్త భాష్యం చెప్పారు.
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు