ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
- 3 వర్గాలు; +వర్గం:నల్గొండ జిల్లా మహిళా ఉపాధ్యాయులు; ±వర్గం:నల్గొండ జిల్లా వ్యక్తులు→వర్గం:నల్గొండ జిల్లా రచయిత్రులు (హాట్కేట్ ఉపయోగించి) |
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 26:
తెలంగాణా విమోచనం జరిగి, కమ్యూనిస్టు పోరాటం ఉధృతం తగ్గాక ఈమె కుటుంబం తమ ప్రాంతానికి తిరిగి వచ్చి నల్గొండలో స్థిరపడింది. సుజాత 1950లో నల్లగొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరింది. అప్పుడే ‘వెల్లోడి’ ప్రభుత్వంలో స్కూళ్ళలో ఉర్దూ బదులు తెలుగు మాధ్యమం వచ్చింది. హెచెస్సి (పదవ తరగతి) పాస్ అయ్యాక అతి కష్టం మీద కాలేజీలో చేరటానికి ఇంట్లో అంగీకరించారు. 1956లో [[హైదరాబాదు]]లోని రాజబహద్దరు వెంకట రామారెడ్డి మహిళాకళాశాల (ఆర్బివీఅర్ఆర్ ఉమెన్స్ కాలేజ్)లో పియుసీలో చేరింది. అక్కడే రెడ్డి హాస్టల్లో వసతి. ఇంగ్లీషు మాధ్యమంతోనూ, నగర సంస్కృతితోనూ ఇబ్బందులు ఎదుర్కొని పియుసీ పూర్తి చేసింది. పియుసీ అయేటప్పటికి నల్గొండలో నాగార్జున కాలేజీ ఏర్పడింది. అక్కడ బి.ఏ మొదటి సంవత్సరం చదివాక గోపాల్ రెడ్డితో 1959లో వివాహమైంది. ఈ దంపతులకు వాసవిక, ఉదయన అనే పిల్లలు కలిగారు.
పెళ్ళైన తర్వాత సుజాత ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో బి.ఏ రెండో సంవత్సరంలో చేరింది. అక్కడే ఎం.ఏ పూర్తి చేసింది. నృపతుంగ మల్టిపర్పస్స్కూల్లో తెలుగు టీచర్గా పని చేయడం మొదలు పెట్టింది. 1966లో జర్మనీలో ట్యుబింగెన్ విశ్వవిద్యాలయంలో జర్మన్భాషలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేయటానికి భర్త గోపాల్రెడ్డికి స్కాలర్షిప్ వచ్చింది. అతనితో పాటు ఈమె కూడా అక్కడకు వెళ్ళింది. అక్కడ టుబింగన్ విశ్వవిద్యాలయం గ్రంథాలయం లోని ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయన గ్రంథాలను ‘సబ్జెక్టు క్యాటలాగ్’ చేయడంలో సహకారం అందించింది. అప్పడు సేకరించిన సమాచారంతోనే “సంస్కృత సాహిత్య చరిత్ర”ను వ్రాసింది. 1969లో జర్మనీ నుంచి తిరిగివచ్చాక కొన్నాళ్ళు మేక్స్మ్యుల్లర్ భవనంలో లైబ్రేరియన్గా పని చేసింది. తాను పియుసీ చదువుకున్న ఆర్బివీఅర్ఆర్ వుమెన్స్ కాలేజ్లోనే పార్ట్టైం లెక్చరర్ ఉద్యోగం వస్తే, ఉపాధ్యాయవృత్తి మీద ఆసక్తితో జీతం తక్కువైనా చేరింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం” అనే సిద్ధాంత వ్యాసానికి 1976లో పి.హెచ్.డి పట్టా పొందింది. ఈమె 2000లో అసోసియేట్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యింది. ఈమె భర్త గోపాలరెడ్డి ఆర్ట్స్కాలేజ్ ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశాక కొన్నాళ్ళకు హృదయ సంబంధమైన శస్త్రచికిత్స కాంప్లికేషన్స్ వల్ల మరణించాడు. ఈమె ప్రామాణికంగా 6 సాహిత్య విమర్శ గ్రంథాల్ని, 3 నవలల్ని 4 కథా సంపుటాల్ని, 4 సాహిత్య చరిత్ర గ్రంథాల్ని, 2 యాత్రా కథన రచనల్ని, మరిన్ని స్త్రీలకు, తెలుగు సాహిత్యానికి, మానవ సంబంధిత గ్రంథాలను వెలువరించింది.ఈమె [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన నూతన సిలబస్ కమిటీలో సలహాదారుగా, పాఠశాల టెక్ట్బుక్ కమిటీలో సభ్యు రాలిగా, తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉపాధ్యక్షురాలుగా ఉంటూ [[సాహిత్యం|సాహిత్య]] కృషి చేస్తున్నది. ఇప్పటికి ఆమె రచనలపై ఒక పి.హెచ్.డి, రెండు ఎం.ఫిల్. గ్రంథాలు వచ్చాయి. ఇంకా ఎందరో పరిశోధకులు ఆమె [[కథలు]], [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లపై పరిశోధనలు సాగిస్తున్నారు<ref>{{cite news|last1=సంపాదకుడు|title=అనుపమ అక్షర కృషీవలురు తెలంగాణ తేజాలు|url=http://manatelangana.news/2016/06/telangana-poets-in-telangana/|accessdate=10 April 2017|work=మన తెలంగాణ|date=13 Jun 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==సాహిత్యసేవ==
|