నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
==బాల్యము, విద్యాభ్యాసము==
నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలంలోని, [[నిమ్మకూరు]] గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య [[విజయవాడ]] మునిసిపలు హైస్కూలులో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరారు. ఇక్కడ [[విశ్వనాథ సత్యనారాయణ]] తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. [[1942]] మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కూతురు అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు. వివాహం విద్యనాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షలలో రెండుసార్లు తప్పాడు. తరువాత [[గుంటూరు]] [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]]లో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే [[నేషనల్ ఆర్ట్ థియేటర్]] గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి [[కొంగర జగ్గయ్య]], [[ముక్కామల]], [[ నాగభూషణం]], [[కె.వి.ఎస్.శర్మ]] తదితరులతో '''చేసినపాపంచేసిన పాపం''' వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తరువాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది. [[సుభాష్ చంద్రబోసు]] విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు.
 
==చలనచిత్ర జీవితం==