జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

Infobox and image added from commons
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (13)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
| occupation = స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పర్యావరణవేత్త
}}
'''ఆచార్య జె. బి. కృపలానీ''' ([[1888]]-[[1982]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. [[1947]] [[భారతదేశం|భారతదేశానికి]] స్వాతంత్ర్యము వచ్చినపుడు [[భారత జాతీయ కాంగ్రెసు]] అధ్యక్షునిగా ఉన్నాడు. కృపలానీ గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త మరియు, స్వాతంత్ర్యసమరయోధుడు.
[[మహాత్మా గాంధీ]]కి దగ్గరగా వుంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచాడు. [[1920]]లలో [[సహాయ నిరాకరణోద్యమం|సహాయనిరాకరణోద్యమం]] నుంచి [[1970]]లలో ఇండియన్ ఎమర్జెన్సీ దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖునిగా [[ప్రసిద్ధి]] చెందాడు.
 
పంక్తి 14:
[[బొమ్మ:Congressmen.png|thumb|right|300px|వార్ధాలో [[సర్దార్ వల్లభాయి పటేల్|పటేల్]], [[అబుల్ కలాం ఆజాద్]], జీవత్‌రాం కృపలానీ తదితర కాంగ్రేసు పార్టీ సభ్యులు]]
 
కృపలానీ నాటి [[సింధు]] (నేటి [[పాకిస్తాన్]]) ప్రాంతంలోని [[హైదరాబాదు]]<nowiki/>లో [[1888]]లో జన్మించాడు. అతని పూర్వీకులు [[గుజరాతీ]] మరియు, సింధీ సంతతులకు చెందినవారు. [[కరాచి]] డి.జె.సైన్సు కళాశాలలో, అతనిని రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు [[కళాశాల]] నుంచి బహిష్కరించారు. తరువాత [[ముంబయి]] ఫెర్గూసన్ కళాశాలలో విద్యనభ్యసించి తరువాత ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ [[దక్షిణ ఆఫ్రికా]] నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడు.
 
కృపలానీ 1920వ దశకపు తొలినాళ్ళలో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. [[గుజరాత్]] మరియి [[మహారాష్ట్ర]]<nowiki/>లోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ మరియు, విద్యా సంబంధ విషయాలపై కృషిచేశాడు. ఆ తరువాత ఉత్తర భారతదేశములోని [[బీహార్]] మరియు, సంయుక్త రాష్ట్రాలలో అదే తరహా ఆశ్రమాలు స్థాపించి బోధించడానికి వెళ్ళాడు. పౌరనిరసనోద్యమంలోనూ మరియు, ఇతర అనేక చిన్న సందర్భాలలోనూ [[బ్రిటీషు పాలన]]కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించినందుకూ, ఉద్రేకపూరిత సాహిత్యాన్ని ప్రచురించినందుకూ అనేక సందర్భాలలో కృపలానీ జైలుకు వెళ్ళాడు.
 
==కాంగ్రేసు నాయకునిగా==
కృపలానీ అఖిల భారత కాంగ్రేసు కమిటీలో చేరి 1928-29లో దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఒక దశాబ్దము పైగా కాంగ్రేసు పార్టీ అత్యున్నత స్థాయి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు. [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహము]] మరియు, క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నిర్వహణలో ప్రధానపాత్ర పోషించాడు. కృపలానీ ఆపద్ధర్మ భారత ప్రభుత్వము (1946-1947)లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశాడు.
 
==కాంగ్రేసు అధ్యక్షునిగా 1950 ఎన్నికల సమయంలో==
సైద్ధాంతికంగా అటు కుడిపక్షమైన [[వల్లభ్ భాయి పటేల్]]‌తోనూ, వామపక్షమైన [[జవహర్ లాల్ నెహ్రూ]]తోనూ విరుద్ధముగా ఉన్నప్పటికీ, కృపలానీ 1947లో భారత స్వాతంత్ర్యానికి అటునిటు క్లిష్టమైన సంవత్సరాలలో కాంగ్రేసు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1948 జనవరిలో గాంధీ హత్య తర్వాత, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో పార్టీ యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కృపలానీ కోరికను నెహ్రూ తోసిరాజన్నాడు. నెహ్రూ, పటేల్ మద్దతును కూడగట్టుకొని, పార్టీకి విస్తృతమైన మార్గదర్శకాలు, మూలసూత్రాలను నిర్దేశించే అధికారము ఉన్నది కానీ ప్రభుత్వము యొక్క దైనందిన వ్యవహారాలలో కలుగజేసుకొనే అధికారాన్ని పార్టీకి ఇవ్వలేమని కృపలానీకి సమాధానమిచ్చాడు. ఇదే పూర్వప్రమాణం ఆ తర్వాత దశాబ్దాలలో ప్రభుత్వము మరియు, పాలక పార్టీ యొక్క సంబంధానికి కేంద్ర హేతువు అయ్యింది.
 
నెహ్రూ, 1950లో కాంగ్రేసు అధ్యక్ష ఎన్నికలలో కృపలానీకి మద్దతిచ్చాడు. పార్టీపై పట్టుకోసం నెహ్రూ నేతృత్వములోని వామపక్షానికి, పటేల్ నేతృత్వములోని కుడిపక్షానికి జరుగుతున్న పోరాటంలో ఈ ఎన్నికలు కీలకమని భావించారు. కృపలానీకి వ్యతిరేకముగా పటేల్ అభ్యర్థిగా, హిందూ జాతీయవాది [[పురుషోత్తమ దాస్ టాండన్]] పోటీచేశాడు. సోమనాథ్ దేవాలయం యొక్క వివాదాస్పద పునర్నిర్మాణము, జనసంఘ్ స్థాపన, నెహ్రూ-లియాఖత్ ఒప్పందములతో ఉద్రేకపూరితమైన జాతీయ వాతావరణంలో ఆర్థిక ప్రణాళికలలో విభేదాల వల్ల టాండన్ చిన్న ఆధిక్యతతో కృపలానీపై గెలిచాడు.
పంక్తి 38:
 
==చరమాంకము==
సమాజిక మరియు, పర్యావరణ విషయాలపై పనిచేస్తూ కృపలానీ జీవితాంతము నెహ్రూ యొక్క పాలనా మరియు, విధానాల విమర్శకునిగా మిగిలిపోయాడు.
 
క్రియాశీలక ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతూనే, కృపలానీ క్రమేణ రాజకీయ నాయకుడిగా కంటే కమ్యూనిస్టుల ఆధ్యాత్మిక గురువుగా పరిణితి చెందాడు. ముఖ్యంగా [[వినోబా భావే]]తో పాటు కృపలానీని అంతరించిపోతున్న గాంధేయవాదుల వర్గానికి నాయకునిగా భావిస్తారు. 1970లలో వినోభా భావేతో పాటు ఈయన అనేక పరిరక్షణ మరియు, సంరక్షణా కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు.
 
1972-73లో, కృపలానీ రానురాను నిరంకుశంగా తయారవుతున్న అప్పటి ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]] యొక్క పాలనపై నిరసన ధ్వజమెత్తాడు. కృపలానీ, [[జయప్రకాశ్ నారాయణ్]]‌లు ఇందిరా గాంధీ పాలన నియంతృత్వంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని భావించారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించుకుందన్న అభియోగము న్యాయస్థానములో నిర్ధారణ కావడంతో, ప్రజలు ఆమె పాలన విధానాలపై విస్మయం చెందారు మరియు, ఆమె రాజకీయ ప్రతిపక్షాలు మరింత బలిష్టమయ్యాయి. నారాయణ్ మరియు, లోహియాలతో పాటు కృపలానీ దేశమంతటా పర్యటించి అహింసాయుత ప్రదర్శనలు మరియు, పౌర నిరసనలు నిర్వహించాలని ప్రజలను కోరారు. 1975లో [[భారత అత్యవసర స్థితి|అత్యయిక పరిస్థితి]]ని విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన రేపడానికి కారకుడైనందుకు, [[జూన్ 26]], 1975 రాత్రి అరెస్టు చేయబడిన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుల్లో 80యేళ్ళు పైబడిన కృపలానీ ఒకడు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] అంతం కావడం, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొంది స్వాతంత్ర్యము తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రేసేతర ప్రభుత్వం నెలకొల్పటం చూడటానికి కృపలానీ జీవించే ఉన్నాడు.
 
కృపలానీ 94 యేళ్ళ వయసులో [[1982]], [[మార్చి 19]]న మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు