అధ్యాపక వృత్తినుండి విరమణ పొందిన తర్వాత అబ్రహాం క్రియాశీలక రాజకీయల్లోకి అడుగుపెట్టాడు. అబ్రహాం 1954 నుండి 1956 వరకు ట్రావెంకూరు శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తరువాత కాంగ్రేసు పార్టీ తరఫున ఒకటవ మరియు, రెండవ కేరళ శాసనసభల్లో నరక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు<ref>{{వెబ్ మూలము|url=http://www.niyamasabha.org/codes/members/m011.htm|title=K. C. Abraham}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://indiatoday.intoday.in/story/no-end-to-problems-between-andhra-pradesh-cm-n.t.-rama-rao-and-state-governor/1/348382.html|title=Governor row|date=30 April 1986}}</ref> 1964లో కేరళ ప్రదేశ్ కాంగ్రేసు అధ్యక్షుడుగా పనిచేశాడు. 1969లో జాతీయస్థాయిలో కాంగ్రేసు పార్టీ చీలినప్పుడు కాంగ్రేసు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 21 మంది కమిటీ సభ్యుల్లో, పది మంది సిండికేటుకు, పది మంది ఇందిరకు మద్దతుగా చీలినప్పుడు, కె.సి.అబ్రహాం సిండికేటు వైపు మొగ్గుచూపినా, ఈయన ఇరువర్గాలకు సయోధ్య కుదుర్చటానికి మధ్యవర్తిత్యం వహించాడు. చర్చలు విఫలమై చివరకు అబ్రహాం సిండికేటుకు మద్దతివ్వడంతో భారత జాతీయ కాంగ్రేసు నుండి [[ఇందిరా గాంధీ]] బహిష్కరణకు గురైంది.