భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రంగస్థల దర్శకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 44:
 
== నాటక ప్రస్థానం ==
ఈయన మేనమామ ధరణి శ్రీనివాసరావు [[నాటక రచయిత]]. భాను ప్రకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న సమయంలో 11 ఏళ్ల వయస్సులో తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై నటించారు. ఆ తొలి నాటకం పేరు ‘తార్‌మార్’. ఇందులో భాను మంచి వేషం వేశారు. అందులోని బాల భాను నటన అందరికీ నచ్చింది. ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు. దాంతో భాను నటనపట్ల తనలోని ఆసక్తిని మరింత పెంచుకున్నారు. తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి [[వినాయకచవితి]] మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో [[ఎస్.కె. ఆంజనేయులు]] అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. ఆ ప్రేరణతో తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
 
తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి [[వినాయకచవితి]] మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో [[ఎస్.కె. ఆంజనేయులు]] అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. ఆ ప్రేరణతో తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
 
[[సైఫాబాద్]] సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భాను ప్రకాష్ కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నారు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భాను ప్రకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
 
తర్వాత [[తెలుగు]] సంగీత, నాటకరంగంలో భాను ప్రకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భాను ప్రకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. భాను ప్రకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. ఈ సంస్థ ద్వారా నటుడు [[నూతన్ ప్రసాద్]] నాటకరంగానికి పరిచయమయ్యాడు.
 
భాను ప్రకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు.
 
ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] వారు అభినందించారు. ఇంకా ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు