'''ఆగ్రా''' ([[ఆంగ్లం]] : '''Agra''') ([[హిందీ]] : आगरा, [[ఉర్దూ]] : آگرا ), ఓ ప్రముఖ నగరం, [[ఉత్తరప్రదేశ్]] లో, [[యమునా నది]] ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. [[టోలెమీ]] ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి [[మహమూద్ గజనీ]] నుండి సంక్రమించింది.<ref>[http://agra.nic.in/hist.htm District Profile - Government Website]</ref> [[1506]]లో [[సికందర్ లోఢీ]] పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని [[తాజ్ మహల్]], [[ఆగ్రా కోట]], [[ఫతేపూర్ సిక్రీ]] మూడునూ [[యునెస్కో]] వారిచే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]] గా, గుర్తింపబడ్డాయి.