ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
|||
పంక్తి 9:
ఫ్రెంచి వారు లాలీ తోలెండాల్ నేతృత్వంలో [[చెన్నై|మద్రాసు]]<nowiki/>ను ముట్టడించి, బ్రిటిషు వారితో యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధం కోసమని దక్కనులో ఫ్రెంచి దళాల కమాండరు డి బుస్సీని మద్రాసు పిలిపించారు. అతడు తన స్థానంలో ఉత్తర సర్కారులకు, ఫ్రెంచి సైన్యానికీ అధికారిగా కాన్ఫ్లాన్స్ను నియమించాడు. 1758 ఆగస్టు 3 న [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న [[రొయ్యూరు]] వద్ద రాజ్యం అప్పగింతలు చేసాడు. బుస్సీని మద్రాసు పిలిపించడం దక్కను, ఉత్తర సర్కారులలో ఫ్రెంచి ప్రాబల్యానికి గొడ్డలిపెట్టు అయింది<ref name=":0" />.
బుస్సీ మద్రాసు వెళ్ళిన సంగతి, ఉత్తర సర్కారుల రక్షణకు తగినంత సైన్యం లేదన్న సంగతీ తెలుసుకున్న [[రాబర్టు క్లైవు|క్లైవు]], అక్కడ ప్రాబల్యం పెంచుకునేందుకు అదే తగిన సమయమని భావించాడు. కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నేతృత్వంలో 2000 మంది సిపాయీలు, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక శతఘ్ని దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిషు అధికారి ఆండ్రూస్ను పంపించి ఆనందరాజుతో ఒప్పందం కుదురుచుకునేలా ఏర్పాట్లు కూడా చేసాడు. అక్టోబరు 15 న వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం వివరాలివి<ref>{{Cite web|url=http://www.kronoskaf.com/syw/index.php?title=1758_-_British_operations_in_Deccan|title=1758 - బ్రిటిష్ ఆపరేషన్స్ ఇన్ దక్కన్|website=|access-date=2016-09-02|archive-url=https://web.archive.org/web/20160307082212/http://www.kronoskaf.com/syw/index.php?title=1758_-_British_operations_in_Deccan|archive-date=2016-03-07|url-status=dead}}</ref><ref name=":1">{{Cite book|url=https://archive.org/details/accountofwarinin00camb|title=An account of the War in India between the English and French|last=Cambridge|first=Richard Owen|publisher=George and Alexander Ewing|year=1761|isbn=|location=Dublin|pages=208}}</ref>
# బ్రిటిషు సైన్యానికి అయ్యే ఖర్చులను నెలకు 50,000 రూపాయల చొప్పున రాజు భరించాలి. ఆఫీసర్లకు నెలకు 6,000 రూపాయల బత్తా ఇవ్వాలి. ఈ మొత్తాలను రాజమండ్రి పట్టణం రాజు అధీనంలోకి రాగానే చెల్లించాలి.
# తీరం నుండి లోపలికి ఉన్న ప్రాంతాలు రాజుకు చెందుతాయి. తీరం మాత్రం దాని వెంట ఉన్న విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పట్టణాలతో సహా కంపెనీ అధీనంలో ఉంటుంది.
|