కీచకుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 13:
పాండవులు ఒక సంవత్సరం పాటు విరాట రాజు రాజ్యభవనంలో పనివాళ్ళుగా చేరినప్పుడు పాండవుల భార్య ద్రౌపది, మహిళా సేవకురాలు (మాలిని) వేషంలో విరాట రాజు సుధేష్ణ దేవికి సేవలు చేయడానికి వెళ్ళింది. కీచకుడు మాలిని చూసి ఆమె అందాన్ని ఆస్వాదించాలని కోరగా దానికి ఆమె నిరాకరించింది. కీచకుడు మాలిని పట్ల తనకున్న కోరికును రాణి సుధేష్ణకు తెలిపి, తనకు మధువు పోయడానికి ఆమెను పంపమని కోరాడు. మాలిని మధువు పోస్తుండగా, కీచకుడు మాలినిని కౌగిలింత చేసుకోవడానికి ప్రయత్నించగా మాలిని ఏడుస్తూ అతన్ని కిందకు తోసేస్తుంది. దాంతో కీచకుడు మాలినిని వెంబడించగా, మాలిని సభా వేదిక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెను వెంట్రుకలతో పట్టుకుని, నేలమీద పడవేసి, మారువేషంలో ఉన్న భర్త [[యుధిష్ఠిరుడు]], విరాటరాజుతో సహా సభికులందరి ముందు కాలితో తన్నాడు. ఆ సంఘటనను చూసి ఎవరూ స్పందించలేరు. కోపంతో పళ్ళు కొరుకుతున్న [[భీముడు|భీముడి]]ని యుధిష్ఠిరుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆజ్ఞాపించాడు.
ఆ రోజు రాత్రి మాలిని, వంటవాడిగా ఉన్న భీముడిని కలుస్తుంది. వారిద్దరూ కలిసి కీచకుడిని చంపడానికి ప్రణాళికను రూపొందిస్తారు. రాత్రి సమయంలో కీచకుడిని నర్తనశాలకు రమ్మని మాలిని చెబుతుంది. దాంతో కీచకుడు నర్తనశాలకు వస్తాడు. చీకట్లో మారువేషంలో ఉండి నిద్రపోతున్న భీముడిని చూసి మాలిని అనుకొని, ముందుకు రాగానే భీముడు ఒక్కసారిగా లేచి కీచకుడిపై పడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీయుడి చేతిలో కీచకుడు మరణిస్తాడు.<ref name="Kichaka badha">{{cite web |title=Virata parva |url=http://www.sacred-texts.com/hin/m04/m04022.htm |website=Sacred text |accessdate=1 July 2020}}</ref>
== మూలాలు ==
|