కీచకుడు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసాన్ని విస్తరించి, మొలక మూస తొలగించాను
పంక్తి 7:
 
'''కీచకుడు''' ([[సంస్కృతం]]: कीचकः ),[[మహాభారతం]] లో [[విరాట పర్వం]] లో వచ్చే పాత్ర. కీచకునికి [[సింహబలుడు]] అనే మరో నామధేయము కూడా ఉంది. కీచకుడు విరాట రాజు భార్య సుధేష్ణ దేవి తమ్ముడు.<ref>{{cite book|title=SRIKRISHNA The Lord Of The Universe By SHIVAJI SAWANT|isbn=9789386888242|url=https://books.google.com/books?id=IHw0DwAAQBAJ&pg=PT478&lpg=PT478&dq=who+is+Kichaka&source=bl&ots=4rShMJNj1z&sig=g5Tu5HXp1b9je_Pv_cW_0Wse6Q8&hl=en&sa=X&ved=0ahUKEwj0w--ou-HWAhXGP48KHYo4AYY4ChDoAQhPMAs#v=onepage&q=who%20is%20Kichaka&f=false|accessdate=1 July 2020}}</ref> కీచకుడు [[ద్రౌపది]]ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తరువాతి రోజు [[నర్తన శాల]]లో [[భీముడు]] కీచకుడిని చంపేస్తాడు.<ref>కీచకులు, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 49.</ref> కీచకుడు అధిక శక్తి, అపారమైన బలం కలిగివున్న వ్యక్తి. విరాట రాజ్యాన్ని శత్రువుల నుండి చాలాసార్లు రక్షించాడు. కీచకుడి సోదరి సుధేష్ణకు [[ఉత్తర కుమారుడు]], [[ఉత్తర]] అనే అందమైన కుమార్తె ఉన్నారు. ఉత్తరను [[అర్జునుడు|అర్జునుడి]] కుమారుడు [[అభిమన్యుడు]] వివాహం చేసుకున్నాడు.
 
[[File:DHANU Bhima kills kichaka.jpg|thumb| left|భీముడు కీచకుడిని చంపడం (ఆర్టిస్టు: ధను)]]
 
విరాటరాజు రాజ్యం (విరాటగర్) ఇప్పుడు తూర్పు నేపాల్ లోని మొరాంగ్ జిల్లాలో ఉంది. కీచకుడు చంపబడిన ప్రదేశాన్ని కీచక్‌బాద్ అని పిలుస్తారు. ఇది బీరత్‌నగర్ నుండి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాపా జిల్లాలో ఉంది. ఝాపాలో అర్జుంధర అనే స్థలం కూడా ఉంది. విరాటరాజు పశువులను [[పాండవులు]] కాపాడి తిరిగి వచ్చేటప్పుడు పశువులకు దాహం వేయగా, అర్జునుడు తన [[గాండీవం]] చేత ఒక చెరువు (ధార) తవ్వి వాటికి నీరు అందించాడు.
 
== మహాభారతంలో==
[[File:DHANU Bhima kills kichaka.jpg|thumb| భీముడు కీచకుడిని చంపడం (ఆర్టిస్టు: ధను)]]
పాండవులు ఒక సంవత్సరం పాటు విరాట రాజు రాజ్యభవనంలో పనివాళ్ళుగా చేరినప్పుడు పాండవుల భార్య ద్రౌపది, మహిళా సేవకురాలు (మాలిని) వేషంలో విరాట రాజు సుధేష్ణ దేవికి సేవలు చేయడానికి వెళ్ళింది. కీచకుడు మాలిని చూసి ఆమె అందాన్ని ఆస్వాదించాలని కోరగా దానికి ఆమె నిరాకరించింది. కీచకుడు మాలిని పట్ల తనకున్న కోరికును రాణి సుధేష్ణకు తెలిపి, తనకు మధువు పోయడానికి ఆమెను పంపమని కోరాడు. మాలిని మధువు పోస్తుండగా, కీచకుడు మాలినిని కౌగిలింత చేసుకోవడానికి ప్రయత్నించగా మాలిని ఏడుస్తూ అతన్ని కిందకు తోసేస్తుంది. దాంతో కీచకుడు మాలినిని వెంబడించగా, మాలిని సభా వేదిక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెను వెంట్రుకలతో పట్టుకుని, నేలమీద పడవేసి, మారువేషంలో ఉన్న భర్త [[యుధిష్ఠిరుడు]], విరాటరాజుతో సహా సభికులందరి ముందు కాలితో తన్నాడు. ఆ సంఘటనను చూసి ఎవరూ స్పందించలేరు. కోపంతో పళ్ళు కొరుకుతున్న [[భీముడు|భీముడి]]ని యుధిష్ఠిరుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆజ్ఞాపించాడు.
 
Line 23 ⟶ 24:
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
{{మొలక-పౌరాణిక వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/కీచకుడు" నుండి వెలికితీశారు