సింహగిరి వచనములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైష్ణవ మతం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిన్న అక్షర దోషం
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
ఇందులోని ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు.
 
శ్రీకాంత కృష్ణమాచారి 13వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారుడు. వీరిగురించువీరిగురించి మొట్టమొదటిసారిగా [[నిడుదవోలు వేంకటరావు]] గారు పేర్కొన్నారు. ఆరుద్ర తన సమగ్ర ఆంధ్రసాహిత్య చరిత్ర పద్మనాయక యుగ సంపుటంలో క్లుప్తంగా ప్రస్తావించారు. అగ్రరచయితల సంఘం తరపున డా. కులశేఖరరావు గారు సింహగిరి వచనములను సేకరించి మొదటిసారిగా ప్రచురించారు. వీరందరు కృష్ణమాచార్యులను "తొలి తెలుగు వచన కవి"గా గుర్తించారు (అన్నమాచార్యుల కంటే ముందుగానే).
 
ఈ సింహగిరి నరహరి వచనములను [[బాలాంత్రపు రజనీకాంతరావు]] గారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంగా భక్తి రంజని కార్యక్రమంలో గానంచేశారు.<ref>{{cite web |last1=బాలాంత్రపు రజనీకాంతరావు |title=భక్తి రంజని |website= www.youtube.com| url= https://www.youtube.com/watch?v=VCzDSOAp9rQ |publisher=ఆకాశవాణి |accessdate=14 January 2021}}</ref>
"https://te.wikipedia.org/wiki/సింహగిరి_వచనములు" నుండి వెలికితీశారు