కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: కి → కి , అభ్యర్ది → అభ్యర్థి, స్వాతంత్ర → స్వాతంత్ర్య (2), → (4)
పంక్తి 38:
 
== జననం ==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు]] జిల్లా, [[పెదకాకాని]] మండలం, [[తక్కెళ్ళపాడు]] శివారు [[రామచంద్రపాలెం (గారపాడు)]] గ్రామంలో భాగ్యమ్మ, రామశాస్త్రులు దంపతులకు 1923 అక్టోబరు 13వ తేదిన జన్మించారు. వీరి మేనమామ పిన్నమనేని సూరయ్య స్వాతంత్రస్వాతంత్ర్య ఉద్యమంలో జైలు కెళ్ళిన దేశభక్తుడు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు.
 
వైద్యునిగా పీపుల్స్ నర్సింగ్ హోమ్ పేరిట [[ప్రజా వైద్యశాల]]ను గుంటూరులో ప్రారంభించిన సదాశివరావు దాదాపు అర్ధ శతాబ్దం పాటు వైద్యవృత్తిలో కొనసాగాడు. మంచి హస్తవాసిగల డాక్టరుగా పేరు తెచ్చుకొన్న సదాశివరావు పేద ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించేవాడు. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
 
== రాజకీయ జీవితం ==
గ్రామీణ ప్రజలపై ఆపేక్షతో, రైతాంగ హక్కుల కొరకై సదాశివరావు రాజకీయ రంగప్రవేశం చేసారు.1978లో జనతా పార్టీ అభ్యర్దిగాఅభ్యర్థిగా [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]] నుండిపోటి చేసి ఓడిపోయారు.
 
[[నందమూరి తారక రామారావు]] తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆ పార్టీలో చేరిన సదాశివరావు 1985లో [[పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం|పెదకూరపాడు నియోజకవర్గం]] నుండి [[శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. 1989లో మరల తెలుగుదేశం తరుపున పోటిచేసి పరాజయం పొందారు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నాడు.
 
== సమాజసేవ ==
గుంటూరు లోని ప్రతిష్ఠాత్మక [[నాగార్జున ఎడ్యుకేషనల్ ట్రస్టు|'''నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ''']] కి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించిన సదాశివరావు తరువాతి కాలంలో అనేక సంవత్సరాలపాటు ఆ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. ఈ నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో ఎనిమిది ప్రముఖ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి.
 
సాహితీ సదస్సు పేరిట గుంటూరులో ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ సదాశివరావు, ఆ సంస్థ ద్వారా ప్రముఖ కవులను, రచయితలను, తాత్వికులను [[గుంటూరు]]కు ఆహ్వానించి వారి ప్రసంగాలను గుంటూరు ప్రజలకు వినిపించాడు.
 
== చరమాంకం ==
[[దస్త్రం:K.Sadasiva rao, sp.cover.jpg|thumb|ప్రముఖ వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు విదుదలైన ప్రత్యేక తపాల కవర్ ]]
డాక్టర్ చలసాని జయప్రదాంబను వివాహమాడిన సదాశివరావుకు ఐదుగురు సంతానం. ఐదుగురూ డాక్టర్లే కావడం విశేషం. భార్య మరణానంతరం ఆమె పేరు మీద గుంటూరులో మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించారు.
 
సదాశివరావు గారు "'''సదాశివమ్'''" పేరిట ఆత్మకథను ప్రచురించాడు. మన దేశ స్వాతంత్రానికిస్వాతంత్ర్యానికి పూర్వమున్న పరిస్థితుల్ని నేటి పరిస్థితుల్ని తులనాత్మకంగా చూపెట్టే ఈ గ్రంథం చదవడానికి ఆసక్తిగానూ, ఒక మంచిమనిషి జీవితాన్ని గురించి చెప్పేదిగానూ ఉంటుంది.
 
డాక్టర్ సదాశివరావు గారు 30.9.2012 న గుంటూరులో మరణించారు.
 
భారత తపాలశాఖ వారు గుంటూరులో 2019 డిసెంబరు 14న డాక్టర్. కాసారనేని సదాశివరావు గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు<ref>{{Cite news|url=http://stampsofandhra.blogspot.com/2019/11/blog-post.html|title=అమరావతి స్టాంప్ & కాయిన్ ఫెస్టివల్|date=December 22, 2019|work=STAMPS OF ANDHRA|access-date=6-7-2021}}</ref>.
 
==ములాలు==
* [http://en.wikipedia.org/wiki/Kasaraneni_Sadasivarao ఆంగ్ల వికీలో వ్యాసం]
*https://web.archive.org/web/20160306203611/http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/29092013/Details.aspx?id=1991810&boxid=25774958
 
<references />
 
[[వర్గం:1923 జననాలు]]
Line 72 ⟶ 74:
[[వర్గం:గుంటూరు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
<references />
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]