సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:201:C02D:6974:988D:E141:D977:5F42 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ తిరగ్గొట్టారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: మానవిక తిరగవేత తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
'''సరైనోడు''' [[2016]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[బోయపాటి శ్రీను|బోయపాటి శ్రీన]]ు అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి [[తమన్|తమన్ యస్]] సంగీతాన్ని సమకూర్చాడు. [[రకుల్ ప్రీత్ సింగ్]], కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[అల్లు అరవింద్]] గారి [[గీతా ఆర్ట్స్]] బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు కాగా కూర్పు కోటగిరి వెంకటేశ్వర రావు.
==కథ==
గన (అల్లు అర్జున్umesh) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, [[హైదరాబాద్]]లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ శ్రీపతి (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. హర్షితా రెడ్డి (కేథరీన్) ముఖ్యమంత్రి కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. తనను చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరిస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి (క్యాధరిన్ ధ్రిసా)ని ఒప్పించి తన ప్రేమను పెళ్ళి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను వెంట తరుముతూ వచ్చిన రౌడీలను గన కొట్టి, ఆమెని కాపాడతాడు.
 
జరిగింది వివరించే క్రమంలో, మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి అనీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో పనిచేస్తూ, ప్రజల కోసం ఉద్యోగాన్ని వదిలివేసి జనం మధ్య పనిచేస్తున్న జయప్రకాష్ లేక జేపీ (సాయికుమార్) ఆమె తండ్రి అనీ తెలుస్తుంది. ధనుష్ (ఆది పినిశెట్టి) ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన తన తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ ఎందరినో హింసిస్తుంటాడు. ఆ క్రమంలో అక్రమంగా రైతుల భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూంటే జేపీ అడ్డుపడతాడు. అతడిని భయపెట్టేందుకు అతని కుమార్తె మహాలక్ష్మిని తన అనుచరులతో కిడ్నాప్ చేయిస్తాడు. గన తండ్రికి, జేపీకి ఉన్న స్నేహం వల్ల వారిద్దరూ వియ్యమందుదామని, గనని పెళ్ళిచూపులకు పంపుతాడు అతని తండ్రి. ఇదే సమయంలో అక్కడ మహాలక్ష్మిని కిడ్నాప్ చేశారని తెలుసుకున్న గన కిడ్నాప్ చేసినవారందరినీ కొట్టి, తప్పు ఒప్పించి ఆమెని తీసుకువస్తాడు. ఆపైన ఆమెని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదనీ, అమ్మాయికి తాను నచ్చలేదని తన తండ్రికి చెప్పమనీ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన ధనుష్ ఆగ్రహోదగ్రుడై ఊరంతటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని జేపీనీ, ముఖ్యులను చంపి, మిగతా ఊరిని తన కనుసన్నల్లోనే ఉంచుకుని, మహాలక్ష్మినీ, ఆమెను కాపాడిన గననీ చంపించేందుకు మనుషులను పంపుతాడు. తప్పించుకున్న మహాలక్ష్మి గనను కలుసుకోవడానికి రోజుల పాటు పరుగెత్తుకుని హైదరాబాద్‌లో గన ఇంటికి వచ్చి చేరుకుంటుంది.
"https://te.wikipedia.org/wiki/సరైనోడు" నుండి వెలికితీశారు