నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

partial copy edit, డైరెక్టరీ సమాచార తొలగించు/కుదించు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:GaneshChowk-nidadavole.JPG|thumb|గణేష్ చౌక్, నిడదవోలు]]
{{Infobox India AP Town}}
'''నిడదవోలు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్టం [[పశ్చిమతూర్పు గోదావరి|పశ్చిమగోదావరి జిల్లా]], జిల్లా[[నిడదవోలు లోనిమండలం|నిడదవోలు మండలానికి]] చెందిన పట్టణం, మండల కేంద్రం.
 
==చరిత్ర==
[[File:ChinnaKaasiRevu-nidadavole.JPG|thumb|చినకాశీరేవు, నిడదవోలు]]
[[బొమ్మ:Golingeswara devalayam mruthyunjaya statue.jpg|thumb|గోలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్నమృత్యుంజయుడి విగ్రహం]]
[[బొమ్మ:Venugopalaswami devalayam nidadavole.JPG|thumb|వేణు గోపాలస్వామి దేవస్థానం]]
[[బొమ్మ:Venkateswara swami devalayam ndd.JPG|thumb|చిన కాశీ రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం]]
 
నిడదవోలును పూర్వం ''నిరవద్యపురం'' అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును [[వేంగి చాళుక్యులు]] పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత అతని సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులతో]] జరిగిన యుద్ధంలో రెండవ చాళుక్య భీముడు యీ నగరంలోనే విజయసారథిగా పేరుపొందాడు.తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు.

మెకంజీ కైఫీయతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరం. చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రంగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం.
 
[[File:ChinnaKaasiRevu-nidadavole.JPG|thumb|చినకాశీరేవు, నిడదవోలు]]
తూర్పు చాళుక్య వీరుడు రెండవ విజయాదిత్యుడు అనేక యుద్ధాలలో శత్రువులనోడించి రాజ్య విస్తరణ చేశాడు. జననష్ట పాప పరిహారార్ధం 108 శివాలయాలను కట్టించి "నిరవద్య " అనగా పాపం లేనివాడు అనే బిరుదు పొందాడు. అతనికి గల నిరవద్య అన్న పేరుతోనే ఈ ప్రాచీన నగరం "నిరవద్య పురమని" చరిత్రలో పిలవబడింది. నిరవద్యపురం, పెదవంగూరులలో రాష్ట్ర కూటలకు-చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీమునకు జరగిన యుద్ధంలో చాళుక్యులు విజయం సాధించడంతో ఈ ప్రాంతంలో వారి పరిపాలన సుస్థిరము కాబడింది. ఆ యుద్ధంలో చాళుక్య భీముని కుమారుడు "ఇరిమర్తిగండ" మరణించాడు. అభిమన్యునితో పోల్చదగిన వీరుడు ఇతడు. "దండిన గండయ్య" అనే ప్రసిద్ధ రాష్ట్ర కూట సేనానిని ఆ యుద్ధంలో ఇతడు సంహరించి హతుడైనాడు.
 
[[బొమ్మ:Golingeswara devalayam mruthyunjaya statue.jpg|thumb|గోలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్నమృత్యుంజయుడి విగ్రహం]]
దక్షిణ భారతదేశ చరిత్ర గతిని మార్చినదీ యుద్ధం. ఆ తరువాత చాళుక్య రాజధాని [[గోదావరి]] ఆవలి గట్టు "రాజమందిరం" నకు చేరింది. నేటికీ ఈ ప్రాంత గ్రామీణులు రాజమండ్రిని రాజమంద్రం అంటుంటారు. గోదావరి ఆవలిగట్టున చాళుక్య రాజులకు వేసవి విడిది కోసం "రాజమందిరాలు" ఉండేదే నేటి రాజమహేంద్రి లేక [[రాజమండ్రి]] సా.శ.972 సం.లో రాజధాని [[రాజమండ్రి]]కి మార్చినట్లు చరిత్ర చెబుతోంది.[[ద్రాక్షారామం]], [[భీమవరం]], [[సామర్లకోట]], [[పాలకొల్లు]] లలోని పంచా రామక్షేత్రాల నిర్మాత 2వ చాళుక్య భీముడే. ఈ దేవాలయాలలోని శిలా శాసనాల ద్వారా "నిరవద్యపుర" ప్రశస్తి తెలుస్తోంది.
 
[[నన్నయ్య]] మహా భారత రచనలో రాజరాజనరేంద్రుని నిరవద్యనరేశ్వర, నిరవద్యరవిప్రభ, నిరవద్యయువతీమదనా అని సంబోధించాడు. దీనిని బట్టి రాజరాజనరేంద్రుని కాలంలో కూడా నిరవద్యపురం చాళుక్యుల ప్రముఖ నగరమని తెలుస్తోంది.తెలుగు వారినందరినీ ఏకం చేయటానికి ఎంతో కృషి సల్పిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి తన జ్యేష్ట కుమార్తె రాణి రుద్రమదేవిని "నిరవద్యపుర" పాలకుడైన వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహం చేశాడు. నిడదవోలు చాళుక్యులుగా వీరు చరిత్రలో ప్రసిద్ధి పొందారు. ఆంధ్ర సామ్రాజ్యన్ని వరంగల్లు రాజదానిగా కాకతీయులు పరిపాలించే సమయంలో రాణి రుద్రమ దేవి నిడదవోలుచాళుక్యుల కోడలు అయ్యింది. అంటే చరిత్ర ప్రసిద్ధినొందిన వీరనారి రాణిరుద్రమ నిడదవోలుకు
కోడలిగా వచ్చిన ఘన చరిత్ర ఈ నగరంనకు గలదు. రుద్రమదేవి-వీరభద్రచాళుక్యుల పెద్ద కుమార్తె ముమ్మిడాంబను మరలా నిడదవోలు చాళుక్యుల వంశం లోనే ఇవ్వడంతో జన్మించిన వాడే ప్రతాపరుడ్రుదు వీరి దౌహిత్రుడు. వరంగల్లును ఏలినవాడు.ఇతను నిడదవోలు చాళుక్యుడే. కాకతీయుడుగా మనకు చెబుతారు. ఓరుగల్లు విధ్వంసం చేయబడి, ప్రతాప రుద్ర చక్రవర్తి బందీగా చేయబడి, రాజమండ్రి ధ్వంసం చేయబడి కటకం వరకూ జరిగిన జునాఖాన్ దండయాత్రలో (సుల్తాన్ కావటానికి ముందు యువరాజు, మహ్మద్ బీన్ తుగ్లక్ ) బహూశా ప్రతాపరుద్రుని కుటుంబము పాలిస్తున్న ఈ నగరం కూడా 1323లో విధ్వంసానికి లోనై యుండవచ్చును. దానికి తగిన చారిత్రిక ఆధారలుగా త్రవ్వకాలలో లభిస్తూనే ఉన్నాయి, ధ్వంసం చేయబడిన ఆలయ శిథిలాలు. పల్లవులకు కంచి ఎటువంటిదో చాళుక్యులకు నిరవద్యపురం అటువంటి గొప్ప శైవక్షేత్రం.
 
[[బొమ్మ:Venugopalaswami devalayam nidadavole.JPG|thumb|వేణు గోపాలస్వామి దేవస్థానం]]
ఇక్కడ నుండి అనేకమంది పండితులు అనేక ప్రాంతాలలో విద్యా సంస్థలకు అధిపతులుగా వేళ్ళేవారు. [[శ్రీశైలం|శ్రీశైల]] పీఠానికి అధ్యాపకులు నిడదవోలు నుండి తరలివెళ్ళారని చరిత్ర చెపుతోంది. గోపరాజు వెంకటానందం ఎంతో పరిశోధించి నిడదవోలు చరిత్రను రచించాడు. త్రవ్వకాలలో లభించిన అనేక విగ్రహాలు, శిల్పకళాఖండాలు, శాసనాలు, నిడదవోలు ప్రాచీనతను చాటుతున్నాయి. 9-2-1959న స్కూలు భవనం నిమిత్తం త్రవ్వుతుండగా జూనియర్ కళాశాల-ఉన్నత పాఠశాల ఆవరణ పడమట వైపు దొరికిన "నందీశ్వరుని" విగ్రహం అపురూప సుందర అద్భుత కాకతీయ శిల్పకళాఖండం. ఈ విగ్రహాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించారు.
 
ఇంకా ప్రాచీన చాళుక్య శిల్పం గల మరో పెద్ద నంది విగ్రహం గొల్లవీధిలో త్రవ్వకాలలో లభించింది. సోమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠింపబడింది. నిడదవోలు చారిత్రక ఘనతను చాటడానికి ఈ విగ్రహాలు ఒక్కటే చాలు. కుల, మత రహితంగా ప్రజలు ఎదురు నిల్చి నందీశ్వరుని విగ్రహన్ని మ్యూజియానికి తరలించకుండా ఆలయంలో ప్రతిష్ఠించారు.
 
[[బొమ్మ:Venkateswara swami devalayam ndd.JPG|thumb|చిన కాశీ రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం]]
ఈ నిరవద్యపురంలో మహాదేవేశ్వరాలయం ఉండేదని అనేక శాసనాల వలన తెలుస్తోంది. ఈఆలయానికి సంబంధించిన వివరాలు [[పాలకొల్లు]], [[పెనుగొండ (ప.గో)|పెనుగొండ]] ఆలయాలలో ఉన్నాయి. బహూశా ఆ మహాదేవేశ్వర ఆలయ ప్రాంగణమే జూనియర్ కళాశాల ఆవరణ కావచ్చునేమో. ఆస్వామివారి లింగమే 200 సం క్రితం గోవు కారణంగా బయటపడిన శ్రీ గోలింగేశ్వర స్వామి కావచ్చునని ఆ స్వామిని 7 తరాలుగా సేవిస్తున్న అర్చిక స్వాములైన శ్రీ కాకుళపు వారి కుటుంబాల విశ్వాసం. అందుకే ఆ మహాదేవేశ్వరుని నందీశ్వర విగ్రహం ఇక్కడకు చేరిందని నమ్మకం.
 
 
నిరవద్యపుర జలదుర్గం చుట్టూ ఎర్రకాలువ, భీమదొర కాలువ, రాళ్ళమడుగు, తాడిమళ్ళ ఆవ, ఉత్తరంగా గోదావరి మధ్యన ఇది నిర్మించబడింది. నీటిలో అతి బలమైనది మొసలి. తాము జల దుర్గ రక్షణలో నున్న మొసలి వంటి బలవంతులమని చాటడానికే తూర్పు చాళుక్యురాజులు "మకరధ్వజులు"గా తమ జండాపై మొసలి గుర్తును కల్గియున్నారు. కనుక వీరికి ఆది నిరవద్యపురమేనని తోస్తోంది. నగరం చుట్టూ దండ నాయకుల పేర్లతో గ్రామాలు కనిపిస్తాయి. ఉదా:ద్రోణంరాజుముప్పవరుడు, సింగవరుడు, గోపవరుడు, తిమ్మరాజు, సమిశ్రుడు. చావుకొలనే "[[చాగల్లు]]" శిక్షలు విధించు స్థలము. పూర్వపు విజయనగరం వలె, వీధుల విభజన, వివిధ వర్ణముల వారు నివసించే వరుసలు, ఈ జలదుర్గమునకు ద్వారమే [[దారవరం]] అక్కడ"రాళ్ళమడుగు" దాటితే ఓడపల్లె వాడపల్లె అక్కడ గోదావరి దాటిన రాజమండ్రి, ఇదీ పూర్వపు నిరవద్యపుర ప్రాంతం అయి ఉండవచ్చునని తెలుస్తోంది.విధ్వంసమునకు గురి కాబడిన చాళ్యుక్య పుణ్యక్షేత్రమైన ఈ నగరంలో తలలు తెగిన నంది విగ్రహాలు, లింగాలు, మహిషాసుర మర్ధని విగ్రహాలు మరెన్నో దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ నిడదవోలు ప్రాచీనతకు చిహ్నాలు.1953 లో [[అవతార్ మెహెర్ బాబా]] వారి పాద స్పర్శచే ఈ గడ్డ మరలా పునీతం కాబడి అన్ని మతముల వారికి నిలయం అయింది. నిరవద్యపురమునకు నిరవద్యప్రోలు- నిడుదవోలు- నిడదవోలు రూపాంతరం మాత్రమే. అయితే ప్రాచీన పూర్వ చరిత్ర యిచ్చే ఘనకీర్తి భావితారలకు సంస్కృతి సంప్రదాయాలను, సాంఘిక- ఆర్థిక పరిస్థితులను, ప్రజల జీవన విధానములను తెలియజేస్తుంది. దేశంలోని మహానగరాలే తమ అసలు పేర్లను ఏర్పరచుకొని మార్పు తెచ్చుకుంటుంటే ఈ ప్రాచీన చారిత్రక ప్రసిద్ధిగల భారతీయనగరం ఇంకా సజీవంగా జీవిస్తూ ఉందని తన ఉనికిని లోకానికి చాటడానికైనా తన అసలు పేరును పొందవలసిన ఆవశ్యకత ఉంది. స్కాందపురాణం "నిరవిద్యపురంబున మహాదేవేశ్వరుడు" అని చెపుతోంది. దీనిని బట్టి కూడా మనం నిరవిద్యపురం ప్రాచీనతను అంచనా వేయవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు