సాక్షి రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 1:
'''సాక్షి రంగారావు''' పూర్తి పేరు '''రంగవఝుల రంగారావు'''. గుడివాడ వద్ద నున్న [[కొండిపర్రు]] గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా [[1967]]లో విడుదలైన బాపూ-రమణల [[సాక్షి (సినిమా)|సాక్షి]]. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. [[బాపు]], [[కె.విశ్వనాథ్]] , [[వంశీ]] తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు [[సాక్షి శివ]] కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించాడు. <ref>http://www.hindu.com/2005/06/28/stories/2005062818720500.htm</ref>. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, [[సిరివెన్నెల]], [[స్వర్ణకమలం]], [[ఏప్రిల్ 1 విడుదల]], [[జోకర్]] మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి.
 
ఆయన నటించిన చివరి సినిమా [[కె.విశ్వనాథ]] దర్శకత్వం వహించిన [[స్వరాభిషేకం]]. గురజాడ వారి నాటకం [[కన్యాశుల్కం నాటకం]] లో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్ చేస్తుండగా మే 5 వతేదీన గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించిన తరువాత తుదిశ్వాస విడిచారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతూ ఉండేవారు.
 
[[చక్కెర వ్యాధి]] ముదిరి [[మూత్రపిండాలు]] పాడయిపోవడంతో [[చెన్నై]] వైద్యశాలలో [[జూన్ 27]], [[2005]] రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.
"https://te.wikipedia.org/wiki/సాక్షి_రంగారావు" నుండి వెలికితీశారు