విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ
చి విస్తరణ
పంక్తి 7:
#ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ <ref>[http://www.swrs.ap.gov.in/ ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు] </ref> <br />
# ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ <ref> [http://www.aptribes.gov.in/html/gurukulam.htm ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు]</ref><br />
=== కేంద్ర ప్రభుత్వ గురుకులాలు (నవోదయ పాఠశాలలు)==
# నవోదయ విద్యాలయ సమితి <ref>[http://www.navodaya.nic.in/welcome%20sbs.htm నవోదయ విద్యాలయ సమితి వెబ్ సైటు] </ref><br/> జిల్లాకి ఒకటి చొప్పున పాఠశాలలను నిరవహిస్తున్నది.
==ప్రవేశ పద్ధతి ==
=== ఐదవ వతరగతితరగతి లో ప్రవేశం ===
'''ఆంధ్రప్రదేశ్ గురుకులాలు:'''
5 తరగతిలో ప్రవేశం పొందడంకోసం, సాధారణంగా మే నెలలోఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు మార్చి ఏప్రిల్ మాసాలలో ఇస్తారు. ఇతర కులాలు, వెనుకబడిన కులాల వారు 9 నుండి 11సంవత్సరాల వయస్సు కలవారై, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు 9 నుండి 13సంవత్సరాల వయస్సు కలవారై వుండాలి. క్రిందటి రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఈ నిబంధన ఎస్ సి, ఎస్ టి వారికి వర్తించదు.
 
ఎంపిక రిజర్వేషన్, ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. మామూలుగా, ఏజిల్లా విద్యార్ధులు ఆజిల్లాలోని పాఠశాలలలోనే చేరాలి. ఐతే, కొన్ని బిసి మరియు, అల్పసంఖ్యక వర్గాల పాఠశాలల్లో ఇతర జిల్లాల విద్యార్ధుల ప్రవేశానికి అవకాశం వుంది. దరఖాస్తులు గురుకుల పాఠశాలలు, జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా ఉప విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో, గిరిజన ప్రాంతాలలోని ఐ టిడిఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయాల్లో అమ్ముతారు.
 
=== ఆరవ తరగతి లో ప్రవేశం ===
నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి లో ప్రవేశం కల్పిస్తారు. ఖాళీ సీట్లకి 9, 11తరగతులలోకూడా ప్రవేశం వుంటుంది. సాధారణంగాప్రవేశ పరీక్ష దరఖాస్తులు సెప్టెంబరు మాసంలో, ప్రవేశ పరీక్ష పిభ్రవరి మాసంలో జరుగుతుంది.
 
=== ఎనిమిదవ తరగతి లో ప్రవేశం ===
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వుంది. ఇవి చాకలి బెల్గాం, ఏటపాక, , శ్రీశైలం, లో వున్నాయి. 7 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 30 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి.
"https://te.wikipedia.org/wiki/విద్యా_సంస్థలు" నుండి వెలికితీశారు