ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.[1]

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం
కృతికర్త: పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
అసలు పేరు (తెలుగులో లేకపోతే): రూరల్ స్టడీస్ ఇన్ ఆంధ్రా
అనువాదకులు: కాకాని చక్రపాణి,
డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి,
గోవిందరాజు చక్రధర్,
జి.వెంకటరాజం
సంపాదకులు: డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి,
ముద్రణల సంఖ్య: 1(2012లో)
అంకితం: పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మలకు
ముఖచిత్ర కళాకారుడు: జి.పురుషోత్త్ కుమార్
దేశం: భారత దేశం
భాష: తెలుగు (మూలం-ఆంగ్లం)
ప్రక్రియ: చరిత్ర గ్రంథం
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
విడుదల: ఆగస్ట్, 2012
పేజీలు: 230
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-82203-06-3
2014 అక్టోబరు 21 న రవీంద్రభారతిలో పురావస్తు పరిశోధకుడు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి దంపతులను సన్మానిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు, ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి తదితరులు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి పి ఆచార్య, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకరరావు కూడా చిత్రంలో ఉన్నారు.

రచన నేపథ్యం మార్చు

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రాసిన ఈ చరిత్ర గ్రంథాన్ని కాకాని చక్రపాణి, డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, జి.వెంకటరాజం అనువదించారు. ఎమెస్కో బుక్స్ డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, సంపాదకత్వంలో ఆగస్టు, 2012లో వెలువడింది. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ఈ గ్రంథాన్ని ఆయన తల్లిదండ్రులు పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మల స్మృతికి అంకితమిచ్చారు.[1]

అంశాలు మార్చు

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం గ్రంథంలో రాతియుగం నుంచి ప్రారంభించి కాకతీయుల కాలం ప్రారంభమయ్యే వరకూ సాగిన గ్రామజీవనం, గ్రామీణ వ్యవస్థల చరిత్ర రచన చేశారు. అందులో భాగంగా ప్రాచీన భూవిభాగాలు, కొత్త రాతియుగపు గ్రామీణ జీవనం, తొలికాలంలో గ్రామీణ జీవితం నుంచి ప్రారంభించారు. ఆపై ప్రదేశాల పేర్లు, పట్టణ కేంద్రాల గురించి, రాజకీయ అధికారం ప్రాదుర్భావమైన పద్ధతి, దాని కాల క్రమం గురించీ రచించారు. సమాజ నిర్మాణాన్ని గురించి, గ్రామపాలన ఉద్యోగుల గురించీ రాశారు. గ్రామాధికారుల చరిత్ర, గ్రామాలలోని సంఘజీవనం, న్యాయవ్యవస్థల గురించి, భూమిని, పన్నుల గురించి రచన చేశారు. గ్రామీణవ్యవస్థకు సంబంధించిన వర్తక-వాణిజ్య మార్గాలు, నాణేల వ్యవస్థ వంటి వాటి గురించి సవిస్తరంగా రచించారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర-గ్రామీణజీవనం:మూ. పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2012