బియ్యపు మధుసూదన్ రెడ్డి

బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బియ్యపు మధుసూదన్ రెడ్డి
బియ్యపు మధుసూదన్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1971
అమ్మపాలెం గ్రామం
శ్రీకాళహస్తి మండలం
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి బియ్యపు శ్రీవాణిరెడ్డి
సంతానం 2 (ప‌విత్రా రెడ్డి)
నివాసం శ్రీకాళహస్తి

జననం, విద్యాభాస్యం మార్చు

బి. మధుసూదన్‌ రెడ్డి 15 మే 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలం, అమ్మపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన బీఏ వరకు పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

బి. మధుసూదన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన జగన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు. ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో 7583 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

బి. మధుసూదన్‌ రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పై 38141 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

నవరత్న నిలయం మార్చు

బి. మధుసూదన్‌ రెడ్డి 'జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను గుడి కట్టించాడు. ఈ నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా అద్దాల గోపురాన్ని నిర్మించారు.[4]ఈ అద్దాల మహల్‌ లో రాగి ఆకుల్లో సీఎం జగన్‌ బొమ్మను చిత్రీకరించగా అందులోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోలు కనిపిస్తాయి.[5]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  4. Andrajyothy. "నవరత్న నిలయంలో అద్దాల మహల్‌ ప్రారంభం". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  5. News18 Telugu (16 August 2021). "సీఎం జగన్ పథకాలకు గుడి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎలా ఉందో చూడండి." Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)