బోండా ఉమామహేశ్వర రావు

బోండా ఉమామహేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో విజయవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బోండా ఉమామహేశ్వర రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014- 2019
ముందు మల్లాది విష్ణు
తరువాత మల్లాది విష్ణు
నియోజకవర్గం విజయవాడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 30 జనవరి 1966
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి సుజాత
సంతానం బోండా సిద్ధార్థ, బోండా రవితేజ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

బోండా ఉమామహేశ్వర రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో విజయవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పై 27161 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2] 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి,[3] 2019లో విజయవాడ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  3. Sakshi (19 March 2019). "బొండా ఉమా, పార్థసారధి రాజీనామా". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.