భరతుడు

రామాయణంలో రాముని తమ్ముడు


భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.

రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు
సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపిన భరతుడు

మూలాలుసవరించు

  1. Naidu, S. Shankar Raju; Kampar, Tulasīdāsa (1971). A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan. Shank. University of Madras. pp. 44, 148. Retrieved 2009-12-21.
"https://te.wikipedia.org/w/index.php?title=భరతుడు&oldid=3721444" నుండి వెలికితీశారు