మాయావతి

(మయావతి కుమారి నుండి దారిమార్పు చెందింది)

మాయావతి భారతీశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసింది. మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించింది. ఆమె 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్‌ జాబితాలో 59వ స్థానంలో నిలిచింది.[1]

మాయావతి
మాయావతి

బెహన్‌ మాయావతి


బహుజన సమాజ్ పార్టీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 సెప్టెంబర్ 2003
ముందు కాన్షీరామ్

పదవీ కాలం
3 ఏప్రిల్ 2012 – 20 జులై 2017
తరువాత అనిల్ అగ్రవాల్
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్

ఉత్తర్ ప్రదేశ్ 18వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
3 జూన్ 1995 – 18 అక్టోబర్ 1995
ముందు ములాయం సింగ్ యాదవ్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
21 మార్చ్ 1997 – 21 సెప్టెంబర్ 1997
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత కల్యాణ్‌ సింగ్‌
పదవీ కాలం
3 మే 2002 – 29 ఆగష్టు 2003
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత ములాయం సింగ్ యాదవ్
పదవీ కాలం
13 మే 2007 – 15 మార్చి 2012
ముందు ములాయం సింగ్ యాదవ్
తరువాత అఖిలేష్ యాదవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-15) 1956 జనవరి 15 (వయసు 67)
న్యూఢిల్లీ,  భారతదేశం
రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ
నివాసం లక్నో, ఉత్తరప్రదేశ్,  భారతదేశం
పూర్వ విద్యార్థి
  • ఫాకల్టీ అఫ్ లా , ఢిల్లీ యూనివర్సిటీ
  • కాళింది కాలేజీ
  • మీరట్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకురాలు
2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతటా ప్రదర్శింపబడిన పోస్టరు

జననం, విద్యాభాస్యం సవరించు

మాయావతి 15 జనవరి 1956న ఢిల్లీలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలని కోరికతో మూడు పరీక్షలు ఒకేసారి పాస్‌ కావాలని భావించి, అధికారులు అనుమతితో 9వ, 10వ ,11 వ తరగతి పరీక్షలను ఒకేసారి రాసి పాసై 16 ఏళ్ళ వయస్సులో (1972) 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె బీఈడీ, ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం సవరించు

మాయావతి లా డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు సిద్ధం అవుతూనే లో 1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. ఆమె ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో ఆమె అలా రాజకీయాల్లోకి వచ్చింది.

మాయావతి 1985లో బిజ్నోర్ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి మీరా కుమార్ చేతిలో ఓడిపోయింది. ఆమె తిరిగి 1987లో పోటీ చేసి ఓడిపోయింది. మాయావతి 1989లో ఉత్తరప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికైంది. ఆమె 1995లో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కాన్షీరామ్ అనారోగ్యం బారినపడడంతో బీఎస్పీ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టింది.

మాయావతి 1998, 1999, 2004లో మూడుసార్లు లోక్‌సభకు, మరో మూడు పర్యాయాలు 1994 నుండి 2012 మధ్య రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది. ఆమె1995లో నాలుగు నెలల పాటు, 1997లో ఆరు నెలలు, 2002 నుండి 2003 వరకు 17 నెలలు, 2007 నుండి 2012 వరకు మొత్తం నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసింది.[2][3]

రచనలు సవరించు

  • బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (హిందీ)
  • బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (ఇంగ్లీషు)
  • మేరా సంఘర్ష్‌ మే జీవన్‌ అవమ్‌ బహుజన్‌ మూమెంట్‌ కా సఫర్‌నామా (హిందీ)
  • ‘ఐరన్‌ లేడీ కుమారి మాయావతి’ - సీనియర్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జమీల్‌ అక‍్తర్‌ రచించాడు
  • ‘బెహన్‌జీ’ - మాయావతి పొలిటికల్ బయోగ్రఫీ, జర్నలిస్టు అజయ్‌ బోస్‌ రచించాడు

మూలములు సవరించు

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
"https://te.wikipedia.org/w/index.php?title=మాయావతి&oldid=3938962" నుండి వెలికితీశారు