మాదాసువారిపాలెం

మాదాసువారిపాలెం. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మాదాసువారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 153.
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం కోలవెన్ను గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు మార్చు

శ్రీ భక్త ప్రపత్తి ఆంజనేయస్వామివారి ఆలయం -ఈ గ్రామములో వేంచేసియున్న శ్రీ భక్త ప్రపత్తి ఆంజనేయస్వామి, సువర్చలాదేవి వార్ల కల్యాణమహోత్సవం, 2014,జూన్-7 శనివారం నాడు కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరుసటి రోజు ఆదివారం నాడు, 2 వేలమందికి అన్నసంతర్పణ నిర్వహించారు. [2]

ఈ ఆలయంలో నూతన ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-1వతేదీ గురువారం నుండి ప్రారంభమయినవి. జూన్-3వతేదీ శనివారం ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం మొదలగు కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ఉదయం 9 గంటలకు ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన నిర్వహించినారు. ఆ రోజున ఉదయం 11 గంటల నుండి భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. సాయంత్రం శ్రీ సువర్చల, ఆంజనేయస్వామివార్ల కళ్యాణోత్సవం అనంతరం గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామం వివాదరహిత గ్రామంగా పేరుపొందింది. ఈ మేరకు గ్రామ సర్పంచి ఈడా కొండలరావుకి, న్యాయ సేవాధికార సంస్థ నుండి ప్రశంసలు అందినవి. [1]

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

[1] ఈనాడు, విజయవాడ/పెనమలూరు; 2014,ఫిబ్రవరి-14; 1వపేజీ. [2] ఈనాడు, విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-9, 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,జూన్-1&4; 1వపేజీ.