మురమండ

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, కడియం మండల గ్రామం

మురమండ, తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలానికి చెందిన గ్రామం.[1].

మురమండ
—  రెవిన్యూ గ్రామం  —
మురమండ is located in Andhra Pradesh
మురమండ
మురమండ
అక్షాంశరేఖాంశాలు: 16°55′00″N 81°50′00″E / 16.9167°N 81.8333°E / 16.9167; 81.8333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కడియం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,566
 - పురుషులు 3,202
 - స్త్రీలు 3,364
 - గృహాల సంఖ్య 1,916
పిన్ కోడ్ 533126.
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన కడియం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మండపేట నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. కడియం మండలంలో పెద్ద గ్రామం మురమండ.దీనికి

దగ్గరి పట్టణాలు రాజమండ్రి:14 కి.మీ, మండపేట:10 కి.మీ దూరంలో ఉన్నాయి.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,825.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,338, మహిళల సంఖ్య 3,487, గ్రామంలో నివాస గృహాలు 1,768 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1916 ఇళ్లతో, 6566 జనాభాతో 756 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3202, ఆడవారి సంఖ్య 3364. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1398 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 45. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587554.[3] పిన్ కోడ్: 533126.

పరిసర గ్రామాలు మార్చు

  • తూర్పున:సీతా నగరం (3.0 కి.మీ, ఏడిద (6 కి.మీ)
  • పడమర:మాధవరాయుడు పాలెం3.0 కి.మీ, రామిరెడ్ది పల్లి (3.0 కి.మీ)
  • దక్షిణం:దుళ్ళ (3.0 కి.మీ)
  • ఉత్తరము:మెర్నిపాడు, జేగురుపాడు, వెలగతోట గ్రామం-అన్ని ఇంచుమించు 3.0 కి.మీ దూరం

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మండపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల వెలుగుబండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల రాజమహేంద్రవరం లోనూ, పాలీటెక్నిక్ బొమ్మూరులోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఢవళేశ్వరంలోను, అనియత విద్యా కేంద్రం కడియంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

మురమండలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.  ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

విద్య మార్చు

విద్యాసౌకర్యం వున్నది, ప్రభుత్వ, ప్రవేటు విద్యాలయాలు ఉన్నాయి.

ప్రభుత్వ, మండల ప్రజా పరిషత్ పాఠశాలలు

  • మండల పరిషత్ పాఠశాలలు 4 గలవు.ఇందులో విద్యాబోధన ఒకటినుండి ఐదవ తరగతి వరకు బోధించెదరు.
  • తమ్మన సూర్య ప్రకాశం &బాబ్బా జానకిరామయ్య జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల
  • పిచ్చుగ కోటయ్య జూనియర్ కాలేజి

ప్రవేటు పాఠశాలలు

  • హోప్ స్కూలు:LKg నుండి 5 వతరగతి వరకు
  • విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్:నర్సరి నుండి 7 వ తరగతి వరకు

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

ఒక మందుల దుకాణం ఉంది.ప్రాథమిక స్థాయిలో వైద్యసదుపాయం అందుబాటులో ఉంది.గవర్నమెంటు వారి ప్రాథమిక వైద్యకేంద్రం (P.H.C) ఉంది.పశువులకై ప్రభుత్వ పశువైద్యశాల ఉంది.

ప్రవేటు ప్రాక్టిసనర్సు రాంబాబు (ఆర్.ఎం.పి),,సత్తిబాబు ( (ఆర్.ఎం.పి), భానుప్రకాశ్ ( (ఆర్.ఎం.పి)

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.జాతీయ గ్రామీణ యోజన పథకం ద్వారా M.P.lands ద్వారా గోదావరి మిగులు జలాలనుండి త్రాగునీటిని అందించుటకై లక్షా యాభైవేల లీటర్ల నిల్వసామర్థ్యంవున్న రెండు టాంకులను నిర్మించినప్పటికి నిరుపయోగంగా ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతం కావటం వలన 30-40 అడుగులలోతుననే మంచినీరు లభిస్తున్నందున, పై పథకంపై ప్రజలు అంతగా అసక్తి కనపరచలేదు.ఇక్కడి మాజీ గ్రామ సర్పంచి గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరును అందించే వుద్దేశ్యంతో స్వర్గీయ ఈదర కొండలరావు మెమోరియల్ ట్రస్టుద్వారా నామమాత్రపు ధరకు ఫిల్టరు నీటిని అందించుచున్నారు.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.సరియైన పారిశుద్ధ వ్యవస్థ లేదు.ఎక్కువ జనాభా బహిరంగ బహిర్భూమినే ఉపయోగిస్తారుసరియైన మురుగునీరు వెళ్ళుకాలువలు లేవు, వర్షాకాలం పరిస్థితి మిక్కిలి దారుణము.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

మురమండలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.గ్రామంలోని వీధులలోని రోడ్ద్లన్ని సింమెంటు రోడ్లే.ప్రధాన వీధిరోడ్దు మాత్రం తారు రోడ్డు.ఈ గ్రామం మారుమూల గ్రామమైనప్పటికి 1980 నుండి 2002 వరకు ఆర్.టి.సి., ప్రవేటు బస్సుల సౌకర్యము చాలా బాగుడేది.2003 నుడి ఆటోల సంఖ్య గణనీయంగా పెరగడంతో, బస్సుల అదాయము తగ్గడంతో, బస్సులను త్రిప్పడం ఆపేసారు.ప్రస్తుతం (2013) రాజమండ్రినుండి కాకినాడకు కడియం, మురమండ మీదుగా వుదయం 7.45 కు ఒకసారి, సాయంత్రం 2.45కు మరిక బస్సు సౌకర్యం ఉంది.కాకినాడనుండి సర్వీసులు లేవు.కావున ఏదైన అత్యవసరంగా ప్రయాణించవలెనన్న ఆటోలను ఆశయించవలస్సిందే.దీని వలన ప్రక్క గ్రామాలలో వుద్యోగం చేసేవారికి, చదువుకొనేవారికి ఇబ్బందిగా ఉంది.ప్రక్క గ్రామాలనుండి ఈ గ్రామాన్ని కలిపే రోడ్లుకూడా అద్వాన్నస్థితిలోవున్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఆంధ్రా బ్యాంక్, సహకార సంఘం, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.ఏటీఎమ్, గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.గ్రామంలో ఆంధ్రా బ్యాంకు ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం, ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

మురమండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 29 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 727 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 83 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 644 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

మురమండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 600 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 44 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

మురమండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, చెరకు

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం, వస్త్రాలు

వృత్తులు మార్చు

ఇచ్చటి అధిక జనులవృత్తి వ్యవసాయము.వరి, చెరకును అధికంగా సాగుచేయుదురు.నీటిపారుదల సౌకర్యము ఉంది.

ప్రార్ధనామందిరాలు మార్చు

ఈ గ్రామంలో హిందువులు, క్రైస్తవ మతస్తులు అధికం.రెండు మతాలకు చెందిన అనేక ఆలయాలున్నాయి.

హిందూ దేవాలయాలు మార్చు

గ్రామంలో 3 రామాలయాలున్నాయి.

  1. బసవేశ్వర స్వామి ఆలయము:ఈ ఆలయం దేవాంగుల వీధిలో ఉంది.అతిపురాతనమైన ఈ మందిరం శిథిలమైపోగా, దాని స్థానంలో క్రొత్త అలయాన్ని నిర్మించారు.
  2. గనపతి ఆలయము:వడ్రంగి, కంసాలి కులాలవారు నిర్మించింది.
  3. వేంకటేశ్వర ఆలయము ; ఈ మందిరం ధర్మకర్తల అధీనంలో వున్నది
  4. శ్రీరామాలయము :పురాతన ఆలయం, శిథిలమైపోగా, నూతన ఆలయం నిర్మాణంలో వున్నది (2013 నాటికి)
  5. రామాలయం:చాకలి, గౌడ కులస్తులు నిర్మించింది.
  6. రామాలయం:కుమ్మరి, బోగం కులస్తులు నిర్మించింది.
  7. ఈశ్వరాలయం:దేవాదాయశాఖ ఆద్వర్యంలో నున్నది.ప్రాచీనమైన, పెద్ద ఆలయం.దీనిని స్థానికులి దేవునిగుడి అనిఅంటుంటారు.ప్రతిసంవత్సరం ఏప్రిల్-మే నెలలలో రథతీర్థం జరుగుతుంది.
  8. అభయాంజనేయ స్వామి ఆలయం:పెద్ద ఆంజనేయుని విగ్రమున్న గుడి.
  9. దుర్గాదేవి ఆలయము :రిక్షాకార్మికులు, తాపీకార్మికులు నిర్మింపజేసిన గుడి.
  10. సాయిబాబా మందిరం: చుట్తుప్రక్కల గ్రామాలకన్న సుందరంగా నిర్మించిన ఆలయం
  11. ఇంకను జట్లమ్మ, ముత్యాలమ్మ, కనకదుర్గ, వినాయకుని గుడులున్నాయి.

క్రైస్తవ ప్రార్ధనామందిరాలు మార్చు

  1. రక్షకుని లూథరన్ దేవాలయం:క్రైస్తవమతానికి ఈ గ్రామంలో ఈ మందిరం ద్వారానే బీజం పడింది.తూర్పుగోదావరి జిల్లాలో ఈ దేవాలయామే మొదటి క్రైస్తవ మందిరంగా భావిస్తారు.ఇది మొదట 10-02-1847 లో సర్ అర్థర్ కాటన్ దొర సహకారంతో ఆంగ్లేయులచే కట్టబడింది. మొదట దేవాలయంతో పాటు ఒక పాఠశాలను కూడా చాలా ఏండ్లపాటు నిర్వహించారు.కాని ప్రస్తుతం (2013 నాటికి) ఈ పాఠశాలను మూసిచేసారు.ఈ పాఠశాల ద్వారా ఆర్థికంగా వెనుకబడివారికి విద్య సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో.మొదట నిర్మించిన దేవాలయం శిథిలమై పోగా 1990 లో నూతన దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది.
  2. బైబిలు మిషను
  3. ప్రవచన దేవుని సంగం
  4. యేసు కృపాలయం
  5. పెనుయేలు మందిరం
  6. క్రీస్తు సంఘం
  7. దేవుని స్వర మందిరం

పరిశ్రమలు మార్చు

  1. ప్లాస్టిక్ గ్లాసుల పరిశ్రమ ఉంది.
  2. P.V.C.పైపుల పరిశ్రమ ఉంది.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=మురమండ&oldid=3835593" నుండి వెలికితీశారు