మొహిద్దీన్ పురం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

మొహిద్దీన్ పురం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E / 15.683; 78.967
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅర్ధవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- 165 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్న ఈ పాఠశాలలో కనీస వసతులు లేవు. సరియైన త్రాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. శ్రీ కల్పన్నేశ్వరస్వామివారి ఆలయం:- మొహిద్దీన్ పురం గ్రామ శివారులో వెలసిన శ్రీ కల్పన్నేశ్వరస్వామివారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు, 2 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
  2. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే నెల-8వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభమైనవి. ఆదివారం వరకు గ్రాఓత్సవంతోపాటు, అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ఆదివారంనాడు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
  3. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ సంసందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.
  4. గ్రామశివారులో వెలసిన పురాతన పాటిమీద శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.

ఈ గ్రామానికి చెందిన శ్రీ బెజ్జం నాయబ్ రసూల్, సైనికుడిగా బెంగుళూరులో విధులు నిర్వహించుచున్నారు. వీరు ఫిబ్రవరి/2015 లో, కేరళ రాష్ట్రంలో నిర్వహించిన, 35వ జాతీయస్థాయి 500 మీటర్లు, 2000 మీటర్ల రోయింగ్ డబుల్స్ క్రీడలలో పాల్గొని, రెండు బంగారు పతకాలు సాధించారు. వీరు త్వరలో ఇటలీ దేశంలో నిర్వహించు పోటీలలో పాల్గొనడానికి కృషి చేస్తున్నారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు