వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 11వ వారం

తట్టు లేదా పొంగు అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో మీజిల్స్ అని పిలుస్తారు. ఈ అంటు వ్యాధి ప్రధానంగా పిల్లలలో వస్తుంది. ఇది మార్‌బిల్లీ వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. తట్టు ప్రపంచములొ ఉన్నట్లుగా క్రీ.పూ.600 సంవత్సరము నుండి ఆధారాలు ఉన్నాయి. తట్టు గురించి శాస్త్రీయమైన విశ్లేషణ 860-932 సంవత్సరాల మధ్య పర్షియా వైద్యుడు ఇబిన్ రాజీ (రాజెస్) చేశాడు. రాజెస్ ఆటలమ్మకు తట్టుకి గల వత్యాసాలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. మొట్టమొదటిసారిగా తట్టుని కలిగించే ఈ వైరస్ 1954వ సంవత్సరములో అమెరికాలో డేవిడ్ ఎడ్‌మాన్‌స్టన్ వర్ధనం చేశాడు. డేవిడ్ ఈ వైరస్ వేరు చేసి కోడి గుడ్డు భ్రూణం (చిక్ ఎంబ్రియో)లో వ్యాప్తి చెందేటట్లు చేశాడు. ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి. 1963 సంవత్సరములో తట్టు వ్యాధి నిరోధక టీకా తయారి జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జెర్మన్ మీజిల్స్ అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది.

తట్టు సంబంధించిన వైరస్ సాధారణంగా శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువ ఉన్నప్రదేశాలలో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. తట్టు వ్యాధి సమాజములొ కనిపించిన వేంటనే ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని నివేదంచాలి. వారు ఆ ప్రదేశములొ ఆ వ్యాధి ప్రబలకుండా ఆ వ్యాధి గ్రస్తులను ఒకచోట వేరు చేసి ఉంచుతారు. సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు ఊపిరిత్తుతులకు నిమ్ము చేరి న్యుమోనియా రావచ్చు. కొద్దిగా అతిసారం జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు మెదడువాపు (ఎన్‌సెఫలైటిస్) , మెనింజైటిస్ అరుదుగా రావచ్చు. ....పూర్తివ్యాసం: పాతవి