వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 03వ వారం

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820-1891) బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటి సారి క్రమబద్ధీకరించాడు. "ఈశ్వరచంద్ర"బిర్సింగా గ్రామము (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము లో జన్మించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత 1828లో కలకత్తాకు మారాడు. సంస్కృత కళాశాలలో చదివాడు.


1839 లో హిందూ న్యాయశాస్త్రము లో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదును అందుకొన్నాడు. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజి లో ప్రధాన సంస్కృత పండిట్ పదవి లభించింది. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టాడు. 1849 లో కాలేజీ నుండి రాజీనామా చేశాడు. ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగము లో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవి లభించింది. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరాడు. స్కూల్ ఇన్స్‌పెక్టర్ పదవిలో 20 స్కూళ్ళను స్థాపించాడు. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యాడు. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించాడు.


విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు. మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి