విశాఖ శ్రీ శారద పీఠం

విశాఖపట్నంలోని చిన్నముసివాడలో ఉన్న హిందూ మత సంస్థ.

విశాఖ శ్రీ శారద పీఠం (శారద పీఠం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని చిన్నముసివాడలో ఉన్న హిందూ మత సంస్థ. దేవత రాజా శ్యామల దేవి, శ్రీ శారదలకు ఈ పీఠం అంకితం చేయబడింది.[1]

విశాఖ శ్రీ శారద పీఠం
విశాఖ శ్రీ శారద పీఠం is located in Visakhapatnam
విశాఖ శ్రీ శారద పీఠం
విశాఖట్నం నగర పటంలో విశాఖ శ్రీ శారద పీఠం స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°48′31″N 83°12′05″E / 17.808504°N 83.201384°E / 17.808504; 83.201384
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రదేశంచిన్నముసిడివాడ, విశాఖపట్నం
సంస్కృతి
దైవంశ్రీ శారద, రాజా శ్యామల దేవి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1997
సృష్టికర్తస్వరూపానందేంద్ర సరస్వతి

గురించి మార్చు

1997లో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ పీఠంను ప్రారంభించాడు. ఈ పీఠం లోపల అనేక దేవాలయాలు ఉన్నాయి.[2] రాజా శ్యామల దేవికి భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం ఇది, రాజా శ్యామల దేవి దేవత కిరీటానికి చిహ్నంగా భావిస్తారు.[3]

  • రాజా శ్యామల దేవి
  • శ్రీ మేధా దక్షిణామూర్తి
  • శ్రీ శారదాదేవి
  • గణపతి
  • ఆది శంకర
  • శ్రీ వనదుర్గ
  • శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి
  • శ్రీ దాస ఆంజనేయస్వామి
  • శ్రీ కృష్ణ
  • శ్రీ దత్తాత్రేయ
  • శ్రీ కాలభైరవ
  • జమ్మివృక్షం
  • నాగదేవత
  • తండవమూర్తి

ప్రధాన అనుచరులు మార్చు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శారదా పీఠం ప్రభావం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పీఠంను అనుసరిస్తున్నారు.[4]

మూలాలు మార్చు

  1. Uttara Peethadhipathi for Sarada Peeth[permanent dead link], the Hans India (December 28, 2016)
  2. in Sarada Peeth, ssp (March 21, 2018)
  3. "AP CM offers prayers at Shyamala Devi temple in Vizag". Business Standard. 4 June 2019. Retrieved 20 May 2021.
  4. Chandrasekhar Rao takes seer’s blessings on TRS foundation day[permanent dead link], Deccan Chronicle (April 28, 2019)
  5. "Jagan Reddy meets PM Modi, discusses special category status for Andhra". Hindustan Times. 26 May 2019. Retrieved 20 May 2021.

బయటి లింకులు మార్చు