వీరాపురం (పిడుగురాళ్ల మండలం)

వీరాపురం, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వీరాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పిడుగురాళ్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522437
ఎస్.టి.డి కోడ్ 08649

గ్రామ విశేషాలు మార్చు

కొమ్ము చంద్రశేఖర్:-ఈ గ్రామానికి చెందిన కొమ్ము ఏసు, చారమ్మ దంపతులు ఒక నిరుపేద కుటుంబానికి చెందినవారు. రోజూ కూలీ పనులకు వెళితేగానీ కుటుంబం గడవదు. వీరు తమ కుమారుడు చంద్రశేఖర్ ను బ్రాహ్మణపల్లి గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు కష్టపడి చదివించారు. ఇతడు చిన్నప్పటినుండి చదువులోనూ, క్రీడలలోనూ రాణించుచున్నాదు. ఇతడు ఆరవ తరగతి నుండియే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ తీసికొనడం ప్రారంభించి అందులో తన ప్రతిభను ప్రదర్శించుచున్నాడు. ఇతడు 2011-12 వ సంవత్సరంలో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో అండర్-14 జట్టు తరపున పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 2012-13 లో రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలలో గుంటూరు జిల్లా జట్టుకి కెప్టెనుగా వ్యవహరించి, జట్టు బంగారు పతకం సాధించడంలో కీలకపాత్ర వహించాడు. అదే సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఇండోరులో జరిగిన జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొని, బంగారు పతకం సాధించాడు. ఇతడు 2013 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. 2014.అక్టోబరు-12 నుండి 16 వరకు, రాజస్థానులోని "పాలీ"లో జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. ఈ పోటీలలో ఇతని ప్రదర్శనకు మెచ్చి ఇతనిని 2015లో ఆష్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ స్కూల్ గేంస్ ఛాంపియును షిప్పు పోటీలలో భారత జట్టులో పాల్గొనటానికి అవకాశం కల్పించారు. ఈ అంతర్జాతీయ పోటీలలో రాణించేందుకుగాను, ఇతడు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాలులో జరిగే శిక్షణ తరగతులకు వెళ్ళేందుకు సిద్ధమగుచున్నాడు. ఈ విధంగా ఇతడు ప్రతిభకు పేదరికం అడ్డం కాదని నిరూపించాడు.[1]

పర్వతనేని రామారావు:- శ్రీ పర్వతనేని రామారావు:- ఈ గ్రామానికి చెందిన వీరు ఒక రైతు. వీరు లక్షల రూపాయల తన స్వంత నిధులతో గ్రామాభివృద్ధికి తన శాయశక్తులా పాటుపడుచున్నారు.[2]

మూలాలు మార్చు

  1. ఈనాడు గుంటూరు రూరల్; 2014;అక్టోబరు-21, 9వపేజీ.
  2. ఈనాడు గుంటూరు రూరల్; 2016;నవంబరు-27, 8వపేజీ.